Begin typing your search above and press return to search.
జగన్ పార్టీలోకి ఆనం..నేదురమల్లి ఎంట్రీ డేట్ ఫిక్స్!
By: Tupaki Desk | 23 Aug 2018 10:29 AM GMTచిత్రమైన పరిణామాలు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడైనా అధికారపార్టీలోకి నేతలు చేరటానికి ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరుకుంటుంటారు. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీ రాజకీయాల్లో నెలకొని ఉంది. అధికారపార్టీకి చెందిన నేతలే కాదు.. మిగిలిన పార్టీకి చెందిన నేతలు సైతం అధికారపార్టీ వైపు కాకుండా విపక్ష పార్టీలో చేరేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది.
గడిచిన కొంతకాలంగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. విభజన నేపథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఆనం.. బాబు తీరు ఏ మాత్రం నచ్చటం లేదు. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే సంప్రదింపులు పూర్తి కావటంతో పాటు.. ఆయన పార్టీలో చేరేందుకు తాజాగా డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలిసిందే. సెప్టెంబరు 2న.. విశాఖపట్నం వేదిక మీద పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అధికారికంగా మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆనంతో పాటు.. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దనరెడ్డి కుమారుడు నేదురమల్లి రాంకుమార్ రెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ సెప్టెంబరు 2న జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు.. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు.. కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్నారు.
గడిచిన కొంతకాలంగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. విభజన నేపథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఆనం.. బాబు తీరు ఏ మాత్రం నచ్చటం లేదు. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే సంప్రదింపులు పూర్తి కావటంతో పాటు.. ఆయన పార్టీలో చేరేందుకు తాజాగా డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలిసిందే. సెప్టెంబరు 2న.. విశాఖపట్నం వేదిక మీద పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అధికారికంగా మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆనంతో పాటు.. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దనరెడ్డి కుమారుడు నేదురమల్లి రాంకుమార్ రెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ సెప్టెంబరు 2న జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు.. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు.. కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్నారు.