Begin typing your search above and press return to search.

ఆయన ఉంటే ముక్కు నేలకు రాయించేవాడంట

By:  Tupaki Desk   |   8 Oct 2015 10:01 AM IST
ఆయన ఉంటే ముక్కు నేలకు రాయించేవాడంట
X
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై తెలంగాణ నేత నాగం జనార్దనరెడ్డి తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. ఫైర్ బ్రాండ్ నాగం.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాను కానీ తెలంగాణ అసెంబ్లీలో ఉండి ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముక్కు నేలకు రాయించేవాడినని వ్యాఖ్యనించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం.. తీసుకుంటున్న తీరుపై అగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

కేసీఆర్ హఠావో.. కిసాన్ బచావో అంటూ నినదించిన ఆయన.. ఈ నినాదంతో ఉద్యమం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10న ప్రతిపక్షాలు చేసే బంద్ నకు తన సంపూర్ణ మద్ధతు ప్రకటించిన నాగం.. విపక్షాలు లేని తెలంగాణ అసెంబ్లీ ఏమిటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. విపక్షాలు పెడుతున్న డిమాండ్లు అసాధ్యమని చెబుతున్న కేసీఆర్ తీరును నిశితంగా విమర్శించారు. అలివికాని హామీలు ఇచ్చినప్పుడు గుర్తుకు రానిది.. రైతుల విషయంలో మాత్రం అలా అనిపిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతున్న నాగం లాంటి వారు నోరు తెరిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందేనని చెబుతున్నారు.