Begin typing your search above and press return to search.

కరోనా భయంతో తమ్ముడ్ని చంపేసిన అన్న

By:  Tupaki Desk   |   27 March 2020 6:17 AM GMT
కరోనా భయంతో తమ్ముడ్ని చంపేసిన అన్న
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. అరుదైన కరోనా వేళ.. ఇలాంటి విచిత్రమైన ఘటనలు రానున్న రోజుల్లో మరిన్ని చోటు చేసుకునే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ వేళ.. ఇంట్లో నుంచి అదేపనిగా బయటకు వెళుతున్న తమ్ముడ్ని వద్దంటే వద్దని వారించాడు. అయినా.. అన్న.. వదిన మాటల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అదే పనిగా బయటకు వెళ్లేవాడు మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన దుర్గేశ్.

ఇతగాడు పూణెలోని ప్రైవేటు కంపెనీలో పని చేసేవాడు. తన అన్న ఇంట్లో ఉంటున్న అతడు.. లాక్ డౌన్ నిబంధనల్ని పట్టించుకోకుండా బయటకు వెళ్లటాన్ని అన్న.. వదినలు తప్పు పట్టేవారు. అదే పనిగా బయటకు వెళ్లి వస్తే.. వైరస్ సోకి అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించాడు.

ఈ క్రమంలో అన్నా తమ్ముళ్ల మధ్య మొదలైన మాటలు..కాసేపటికే భౌతిక దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. దీంతో.. విపరీతమైన ఆగ్రహంతో ఉన్న అన్న.. కోపంతో తమ్ముడిని కొట్టటం.. ఆ క్రమంలో అతడు మరణించాడు. ఈ ఉదంతానికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందటంతో.. వారు దుర్గేశ్ సోదరుడు రాజేశ్ ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు.