Begin typing your search above and press return to search.

జగన్ ను భీమ్లానాయక్ మూవీ చూడాలని కోరిన ఎంపీ

By:  Tupaki Desk   |   27 Feb 2022 12:14 PM IST
జగన్ ను భీమ్లానాయక్ మూవీ చూడాలని కోరిన ఎంపీ
X
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వం అనుసరించిన తీరుపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

పవన్ తో తమకున్న రాజకీయ విభేదాల్ని మనసులో పెట్టుకొని.. ఈ సినిమాను ఎంతలా ఇబ్బంది పెట్టాలో అంతలా ఇబ్బంది పెట్టిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఈ తరహా రాజకీయాలు ఇప్పటివరకు లేదని.. ఇలాంటి తీరు రానున్న రోజుల్లో మరిన్ని దరిద్రపుగొట్టు సంప్రదాయాలకు మూలంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా.. ఏపీలోని పలు థియేటర్లలో అధికారులు.. పోలీసుల హవా ఎక్కువగా కనిపించటం తెలిసిందే. సినిమాను అడ్డుకునేందుకు ఎన్ని నిబంధనలు చూపిస్తూ.. చిరాకు తెచ్చే ప్రయత్నం చేసినా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం మూవీని చూసే విషయంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య 'ఇగో' ఇష్యూ విషయాన్ని ఎంతవరకు తీసుకెళ్లిందన్న విషయాన్ని వెల్లడించే ఈ చిత్రంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న భీమ్లానాయక్ మూవీని తాను చూశానని బీజేపీ ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. విజయవాడలో తాను భీమ్లా నాయక్ మూవీని చూశానని.. ఈ సినిమా విజయాన్ని అడ్డుకోవటానికి ఎన్ని అవకాశాలు ఉంటే.. అన్ని అవకాశాల్ని వినియోగించిన వైసీపీ సర్కారుకు మూవీ భారీ విషయం షాకిచ్చేలా ఉందన్నారు.

రాజకీయాల్ని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమ్లానాయక్ మూవీని చూడాలని కోరారు. ఈ సినిమాను సీఎం జగన్ చూస్తే.. తప్పకుండా నచ్చుతుందని పేర్కొన్నారు. జీవీఎల్ మాటలకు సీఎం జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమని చెప్పక తప్పదు.