Begin typing your search above and press return to search.

హీరోయిన్ తెలుగు.. లోక్ సభ దద్దరిల్లింది..

By:  Tupaki Desk   |   7 Aug 2019 9:44 AM GMT
హీరోయిన్ తెలుగు.. లోక్ సభ దద్దరిల్లింది..
X
ఆమె ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. కానీ తెలుగు వ్యక్తి కాదు.. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎంపీ.. కానీ తెలుగుపై మమకారాన్ని మాత్రం వదల్లేదు. ఏకంగా పార్లమెంట్ సాక్షిగా తేటతెలుగును మాట్లాడి అందరినీ సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది.

నవనీత్ కౌర్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన ‘శీను వాసంతి లక్ష్మీ’ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమె నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. బాలయ్యతో ‘మహారథి’.., జగపతి, నిర్ణయం, యమదొంగ , రూమ్ మేట్స్ ఇలా ఫ్లాప్ బాటపట్టాయి. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాక ఈమె రాందేవ్ బాబా యోగా క్యాంప్ లో చేరగా.. అక్కడే రాజకీయ నాయకుడైన రవిరాణాతో పరిచయమైంది. 2011లో అతడిని పెళ్లాడింది. రవిరాణా మహారాష్ట్రలోని బద్నేరా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్ 2014లో మహారాష్ట్ర పార్టీ అయిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అమరావతి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన నవనీత్ కౌర్.. అక్కడ ఐదుసార్లు శివసేన ఎంపీ ఆనందరావును ఓడించారు. భర్త పోటీచేసిన నియోజకవర్గం ఈమె పరిధిలో ఉండడం కలిసివచ్చింది.

తాజాగా లోక్ సభలో జమ్మూకశ్మీర్ పై మంగళవారం చర్చలో హీరోయిన్ ఎంపీ తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచింది. జమ్మూకశ్మీర్ అంశంపై మాట్లాడిన నవనీత్ కౌర్ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తిగా మద్దతు పలికారు. దశాబ్ధాల సమస్యను పరిష్కరించారని.. తన పూర్తి మద్దతు తెలుపుతున్నాంటూ ప్రసంగాన్ని కొనసాగింది. అయితే ఈ సందర్భంగా ఆమెకు ఓ తెలుగు ఎంపీ అడ్డుతగలబోగా.. అతడికి తెలుగులో సమాధానమిచ్చి షాకిచ్చింది. ‘‘రెండు నిమిషాలు ఆగండి.. నాకు తెలుగు తెలుసు నేను, మీరు అపోజిషన్ లో ఉన్నాం.. ’’ అడ్డుపడకండి అంటూ హెచ్చరించారు. ఇలా పార్లమెంట్ లో మహారాష్ట్ర కు చెందిన ఎంపీ హీరోయిన్ తెలుగు పలికి సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.