Begin typing your search above and press return to search.

గొర్రెకుంట భావి : రఫీక కూతురిపై 5 నెలలుగా అత్యాచారం.. సంజయ్‌పై మరో 2 కేసులు !

By:  Tupaki Desk   |   5 Jun 2020 5:30 PM GMT
గొర్రెకుంట భావి : రఫీక కూతురిపై 5 నెలలుగా అత్యాచారం.. సంజయ్‌పై మరో 2 కేసులు !
X
వరంగల్ గొర్రెకుంట లో సంచలనం సృష్టించిన 9 హత్యల కేసులో విచారణ జరిగేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీలో నిందితుడు సంజయ్ కుమార్ నుంచి కీలక వివరాలను పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. నిందితుడు ఆరురోజుల కస్టడీలో ముఖ్యమైన సమాచారం రాబట్టి, మరో రెండు కేసులను ఫైల్ చేశారు, నిందుతుడిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే ..రఫీక కూతురు 14 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసినట్టు అంగీకరించాడు. పలుమార్లు లైంగికదాడి చేసినట్టు తెలుపడంతో.. బాలికకు వైద్య పరీక్షలు చేశారు.

వరంగల్ ‌లోని ఓ ఇంట్లో ఉన్న బాలికను పరీక్షించిన వైద్యులు గర్భం దాల్చిందని తెలుస్తోంది. అయితే నిందితుడు బాలిక పై గత 5 నెలల నుంచి అత్యాచారం చేసినట్టు సమాచారం. దీంతో హత్య కేసులతో పాటు బాలికపై లైంగిక దాడికి సంబంధించి, అత్యాచారాం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని గీసుకొండ సీఐ శివరామయ్య తెలిపారు. కూతురిపై సంజయ్ కుమార్ ప్రవర్తనను చూసి, రఫీక నిలదీసింది. తీరు మార్చుకోవాలని కోరడంతో, బెంగాల్ తీసుకెళ్తానని చెప్పి రైల్లో హత్య చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఇదే సమయంలో రఫీక గురించి మక్సూద్ భార్య పదే పదే అడగడంతో.. ఇంట్లో బర్త్ డే పార్టీ చేసుకుంటున్న సమయంలో స్లీపింగ్ పీల్స్ కలిపి, సృహ కోల్పోయాక పాడుబడ్డ బావిలో పడేశాడు. ఇదంతా కూడా రఫీక కూతురి కోసమే జరిగిందని తెలుస్తోంది. 9 హత్యలతోపాటు మరో రెండు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.మే 20వ తేదీన మక్సూద్ పెద్ద కుమారుడు పుట్టినరోజున సంజయ్ కుమార్ ఘాతుకానికి పాల్పడ్డాడు. వారంతా బర్త్ డే బిజీలో ఉంటే, ఆహారంలో విషం కలిపాడు. మక్సూద్ ఫ్యామిలీ ఏడుగురు సహా, పై పోర్షన్‌లో అద్దెకుంటే మరో ఇద్దరు కూడా ఆహారం తిన్న తర్వాత మత్తులోకి జారుకున్నారు. తర్వాత వారందరినీ గోనె సంచిలో వేసి బావిలో పడేశాడు