Begin typing your search above and press return to search.

దారుణం : బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం!

By:  Tupaki Desk   |   22 May 2020 8:10 AM GMT
దారుణం : బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం!
X
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. కోల్‌కతాకు చెందిన వలస కార్మికుల కుటుంబం ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్టీయల్ ఏరియాలోని ఓ బారదాన్ గోడౌన్ లో గల బావిలోపండి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు మృతి చెందారు. ఈ బావిలో నుంచి గురువారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. ఆ తరువాత ఈ రోజు ఉదయం ఒకటి తర్వాత ఒకటి మొత్తం మూడు మృతదేహాలు బావిలో తేలాయి.

ఈ మృతులంతా బెంగాల్ ‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. మృత దేహాలను బావిలో నుంచి వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇంకో మృతదేహం కూడా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు బావిలోని నీరు తోడుతున్నారు. కొంతకాలంగా వలస కార్మికులకు జీవనోపాధికి ఇబ్బందిగా మారడం, స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితులు రావడం వంటి కారణాలతో వారేమైనా ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిలో ఇప్పటికి ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ తెలియలేదు. ఇక వీరితో పాటు అక్కడే నివాసం ఉన్న మరో ఇద్దరు బీహార్ యువకులు కనిపించకపోవటంతో ఇది హత్యేమో అన్న అనుమానాలు మొదలైయ్యాయి.అయితే, మక్సూద్ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, వారి కుటుంబం మొత్తం కలిసి రోజుకు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తోందని ట్రేడర్స్ యజమాని తెలిపాడు. యితే ఇదే సమయంలో వలస కార్మికుల మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం మక్సూద్ మనవడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా, ఆ సందర్భంలో భర్తను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న బుస్రా విషయంలో మక్సూద్ కుటుంబానికి, బీహార్ యువకులకు మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో ఈ కుటుంబము ఏమైనా విషప్రయోగం జరిగిందని అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు