Begin typing your search above and press return to search.

కేంద్ర‌మంత్రి న‌న్ను రేప్ చేశాడు..

By:  Tupaki Desk   |   2 Nov 2018 7:45 PM GMT
కేంద్ర‌మంత్రి న‌న్ను రేప్ చేశాడు..
X
వెట‌ర‌న్ జ‌ర్న‌లిస్ట్‌ - మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ప‌ద‌విని వీడిన‌ప్ప‌టికీ...ఆయ‌న‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొనసాగుతున్నాయి. మీటూ ఉద్యమంలో భాగంగా అక్బర్‌పై కూడా పలువురు జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ - తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ జర్నలిస్ట్ అక్బర్‌ పై సంచలన ఆరోపణలు చేశారు. రెండు దశాబ్దాల కిందట అక్బర్ తనను రేప్ చేశారని ఆమె వెల్లడించారు. పల్లవి గొగొయ్ అనే ఆ జర్నలిస్ట్ ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో ఎడిటర్‌ గా పని చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట అక్బర్ ఏషియన్ ఏజ్ ఎడిటర్‌గా ఉన్న సమయంలో తాను జర్నలిస్ట్‌గా చేరానని - ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనను లొంగదీసుకున్నారని పల్లవి ఆరోపించారు. అక్బ‌ర్ త‌న‌ను ఎలా వేధించారో ఆమె వాషింగ్ట‌న్ పోస్ట్‌ కు రాసిన ఆర్టిక‌ల్‌ లో వివ‌రించారు. తనలాగే చాలా మంది అమ్మాయిలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తనను షాక్‌ కు గురి చేసిందని చెప్పారు.

మ‌రోవైపు, అమెరికాలో ఉంటున్న పల్లవి గొగొయ్ అనే మహిళ తనపై అత్యాచార ఆరోపణలు చేయడాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తీవ్రంగా ఖండించారు. ఆమెవన్నీ నిరాధార ఆరోపణలే అని కొట్టి పారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌ కు రాసిన ఓ ఆర్టికల్‌ లో అక్బర్ తనను లైంగికంగా వేధించారని పల్లవి అనే జర్నలిస్ట్ వెల్లడించారు. ఈ ఆర్టికల్‌ పై అక్బర్ స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు ఆరోపణలు. ఆ ఆర్టికల్ నేను కూడా చదివాను. అందుకే కొన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను అని అక్బర్ చెప్పారు. అయితే తమ మధ్య బంధం ఉన్న విషయాన్ని మాత్రం ఆయన అంగీకరించారు. ఇద్దరి సమ్మతంతోనే తమ మధ్య సంబంధం ఉన్నదని, అది కొన్ని నెలల తర్వాత గొడవల కారణంగా తెగిపోయిందని అక్బర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ``1994లో పల్లవి గొగొయ్‌కి, నాకు మధ్య సంబంధం ఉండేది. ఇది కొన్ని నెలల పాటు కొనసాగింది. అయితే ఈ బంధం నా ఇంట్లో గొడవలకు కారణమైంది. దీంతో మా మధ్య సంబంధం అర్ధంతరంగా ముగిసింది`` అని అక్బర్ స్పష్టం చేశారు.

అటు ఆయన భార్య మల్లికా అక్బర్ కూడా తన భర్తపై పల్లవి చేసిన రేప్ ఆరోపణలను ఖండించారు. పల్లవి చెప్పేది పూర్తిగా అబద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ``నా భర్తపై ఇన్నాళ్లూ మీ టూ ఆరోపణలు వస్తున్నా మౌనంగా ఉన్నాను. అయితే పల్లవి రేప్ ఆరోపణలు చేయడంతో ఇక పెదవి విప్పక తప్పడం లేదు. తుషితా పటేల్ - పల్లవి గొగొయ్ తరచూ మా ఇంటికి వచ్చి ఎంతో ఆనందంగా డ్రింక్ చేస్తూ గడిపేవారు. రెండు దశాబ్దాల కిందట ఈ పల్లవి మా కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఆమెతో నా భర్తకు ఉన్న సంబంధం కొన్ని అర్ధరాత్రి కాల్స్‌తోపాటు ఇద్దరూ పబ్లిగ్గా సన్నిహితంగా ఉండటం ద్వారా నాకు తెలిసింది. మా ఇంట్లో ఏషియన్ ఏజ్ తరఫున జరిగిన పార్టీలో వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం నన్ను బాధించింది. ఇదే విషయమై మా ఆయనను నిలదీయగా.. ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు`` అని మల్లికా అక్బర్ చెప్పారు.