Begin typing your search above and press return to search.

సహజవాయువు రంగంలో ఎంఈఐఎల్‌ రికార్డులు

By:  Tupaki Desk   |   20 May 2019 7:21 AM GMT
సహజవాయువు రంగంలో ఎంఈఐఎల్‌ రికార్డులు
X
సహజ వాయువు - చమురు రంగంలో గత ఏడాదిలో దేశ - విదేశాల్లో వివిధ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ఎంఈఐఎల్‌ రికార్డ్‌ సృష్టించింది. దేశంలో అసోం - గుజరాత్‌ - ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణా - త్రిపుర - కర్ణాటక - రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా కువైట్‌ - జోర్డాన్‌ - బాంగ్లాదేశ్‌ - సింగపూర్‌ తదితర దేశాలో రిఫైనరీ తదితర పనులను చేపట్టవి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నది. జోర్డాన్ లో 54 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ ను - కువైట్‌ లోని 66 స్టోరేజ్‌ ట్యాంకుల నిర్మాణం - రికార్డ్‌ సమయంలో రాజస్థాన్‌ లోని రాగేశ్శరి గ్యాస్‌ యూనిట్‌ - ఓఎన్‌ జీసీలో 6 పైప్‌ లైన్ల రిప్లేస్‌ మెంట్‌ అలాగే ఓఎన్‌ జీసీ అస్సాం రాష్ట్రంలో 5 పైప్‌ లైన్ల రిప్లేస్‌ మెంట్‌ - ఈశాన్య రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అస్సాంలో గ్యాస్‌ ఉత్పత్తి - తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్నాటకలో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ - నాగాయలంక - పెనుగొండలో ఆన్‌ షోర్‌ ఫీల్డ్స్‌ ఏర్పాటు చేసింది.

జోర్డాన్‌ లో...

జోర్డాన్‌ లో సహజవాయువుతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంటును ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. దీని ద్వారా 54 మెగావాట్ల విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తోంది. 2018 అక్టోబర్‌ లో ఎంఈఐఎల్‌ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి అరబ్‌ పోటాష్‌ కంపెనీకి అప్పగించింది.

కువైట్‌ అల్‌ జౌర్‌ ప్రాజెక్ట్‌

కువైట్‌ లో 66 ఆయిల్‌ స్టోరేజ్‌ ట్యాంకులను ఎంఈఐఎల్‌ నిర్మాణం చేసింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంఈఐఎల్‌ 3000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కోటి గంటల పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నందుకు కెఐపీఐసీ నుంచి ఎంఈఐఎల్‌ ప్రశంసా పత్రం అందుకుంది.

రాగేశ్వరి గ్యాస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌:

రాజస్థాన్‌ లోని రాగేశ్వరి గ్యాస్‌ టెర్మినల్‌ ప్లాంట్‌ ను 6 నెలల్లోనే పూర్తి చేసి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఎంఈఐఎల్‌ ఈ ప్రాజెక్ట్‌ ను ఒక ఛాలెంజింగ్‌ గా తీసుకుని 2018 సెప్టెంబర్‌ నెలలో పనులు మొదలుపెట్టి మార్చి 2019 నాటికి చేసింది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కేవలం ఆరునెలల రికార్డ్‌ సమయంలో పూర్తి చేసి కేయిర్న్‌ ఇండియాకు అప్పగించింది. ఇక్కడ 90 ఎంఎంఎస్‌ ఎఫ్‌ డి సామర్థ్యం గల ఆయిల్‌ - గ్యాస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ లను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ ఆపరేషన్‌ - మెయింటెనెన్స్‌ పనులను ఎంఈఐఎల్‌ 18 నెలల పాటు చూడనుంది.

అస్సాం ఓన్జీసీ ప్రాజెక్ట్‌..

అస్సాంలోని ఓఎన్జీసీలో ఆరుపైపులను పునర్‌ నిర్మించే ప్రాజెక్ట్‌ ను ఎంఈఐఎల్‌ దక్కించుకుని విజయవంతంగా పూర్తిచేసింది. 5 సెగ్మెంట్‌ లో 128.3 కిలోమీటర్ల మేర పైప్‌ లైన్‌ - ఒక సెగ్మెంట్‌ లో 16.5 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ ను ఎంఈఐఎల్‌ పునర్‌ నిర్మించి ఓఎన్జీసీకి అప్పగించింది. ఇప్పటికే 2017లో ఎంఈఐఎల్‌ 48.3 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను ఈ ప్రాజెక్ట్‌ లో పూర్తి చేసింది.

అస్సాం పునరుద్ధరణ ప్రాజెక్ట్‌

అస్సాంలోని ఓఎన్జీసీ ప్రాజెక్ట్‌ వ్యవస్థను పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టును ఎంఈఐఎల్‌ చేపట్టింది. అందులో కీలకమైన జిజిఎస్‌ ను పూర్తి చేసి ఒఎన్‌ జిసికి ఎంఈఐఎల్‌ అప్పగించింది. జిజిఎస్‌ లో ప్రధానంగా బావి నుంచి లభించే ముడి చమురును గ్యాస్‌ - డీజిల్‌ - ఇతర అనుబంధ ఉత్పత్తుగా వేరుచేసే సెపరేటర్లు ఉన్నాయి. వీటిని ఎంఈఐఎల్‌ అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతుల్లో నిర్మించింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసే తదనంతరం నిల్వ - సరఫరాకు అవసరమైన నిర్మాణాలు జరిగాయి. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో రాబోయే మూడు దశాబ్దాల అవసరాలకు తగిన విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిర్మాణాలను ఎంఈఐఎల్‌ నిర్మించింది.

మెహసనలో అధునాతన అగ్నిమాపక సౌకర్యాలు

ఎంబీ లాల్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం గుజరాత్‌ లోని మెహసనలో అగ్నిమాపక వ్యవస్థను 4 భాగాలుగా పునర్‌ వ్యవస్థీకరించే ప్రాజెక్ట్‌ ను ఎంఈఐఎల్‌ దక్కించుకుని పూర్తి చేసింది. ఇందులో కొత్తగా అగ్నిమాపక వ్యవస్థ నిర్మాణం - హైడ్రాన్ట్స్‌ - వాటర్‌ - ఫోమ్‌ మానిటర్లు - హెచ్‌ వీఎల్‌ ఆర్‌ - నీటి స్ప్రిక్లర్‌ సిస్టం సహా మెహసానలో ఏర్పాటు చేశారు.

నాగయలాంక - పశ్చిమ పెనుగొండ గ్యాస్‌ క్షేత్రాలు

ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణాలో గ్యాస్‌ గ్రిడ్‌ నెట్‌ వర్క్‌ ను మెరుగుపరచడానికి ఎంఈఐఎల్‌ నాగయలాంక - పశ్చిమ పెనుగొండ ప్రాంతాలలో ఓఎన్‌ జీసీ నుంచి ఆన్‌ షోర్‌ గ్యాస్‌ క్షేత్రాలను దక్కించుకుంది. ఈ క్షేత్రాల నుంచి రోజుకు 130000 ఎస్‌ సీఎమ్‌ గ్యాస్‌ ను తరలించేలా ఏర్పాటు చేసింది. ఇందుకోసం అమెరికా నుండి తెప్పించిన అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నారు.

నాగాయలంక క్షేత్రాన్ని ఇప్పటికే ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లాలో గ్యాస్‌ ను ఎంఈఐఎల్‌ పంపిణీ చేస్తోంది. అలాగే తెలంగాణాలో పరిశ్రమలకు కూడా అందించాలని ఎంఈఐఎల్‌ ఏర్పాట్లు చేస్తున్నది. పశ్చిమ పెనుగొండ క్షేత్రానికి ఓఎన్జీసీ ఆమోదం పొందిన తర్వాత ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి అన్నింటిని ఎంఈఐఎల్‌ సిద్ధం చేసింది.

అలాగే ఇప్పటికే ఎంఈఐఎల్‌ గృహ అవసరాకోసం ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా - కర్నాటకలో బెల్గాం - తూంకూరు జిల్లాలో సరఫరా చేస్తోంది. తెలంగాణాలోని పది జిల్లాలలో త్వరలో సరఫరా ప్రారభించనుంది.