Begin typing your search above and press return to search.
మోడీ వదిలించుకుంటేనే.. దేశానికి అసలైన స్వాతంత్య్రం.. సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 18 Jan 2022 11:30 PM GMTఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. మోడీని, బీజేపీని కేంద్రం నుంచి వెళ్లగొడితే తప్ప.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు కాదని.. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డ ఆమె.. మోడీ సహా బీజేపీ నేతలు వివిధ వర్గాల మధ్య విద్వేష బీజాలు నాటుతున్నారని ఆరోపించారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే పెద్దదని వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో జమ్ముకశ్మీర్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని వాపోయారు.
అయితే, యువత మాత్రం అధికార పార్టీ బెదిరింపులకు వెనకడుగు వేయకుండా.. అహింసాయుతంగా, ప్రేమ, స్నేహా సందేశాలను చాటుతూ దేశ సవాళ్లకు దీటుగా నిలబడాలని కోరారు. పీడీపీ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించిన గిరిజన యువజన సదస్సులో ముఫ్తీ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు. బీజేపీ నేతలు దేశాన్ని నాశనం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఈడీ, ఇతర ప్రభుత్వ సంస్థల దాడులు, అరెస్టులు నిత్యకృత్యంగా మారాయి. కశ్మీర్ పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దారుణంగా మారింది. అని దుయ్యబట్టారు.
అంతేకాదు.. చరిత్ర అందరికీ ఓ అవకాశాన్ని ఇస్తుందని, బ్రిటీషర్ల నుంచి విముక్తి కోసం దేశ ప్రజలు గతంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఇప్పుడు బీజేపీని వదిలించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. అయితే.. ఇది స్వాతంత్య్రం కంటే పెద్దదని.. ఎందుకంటే బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోందని ముఫ్తీ అన్నారు. జమ్ముకశ్మీర్ అనేది మహాత్మా గాంధీ భారత్లో చేరిందని.. ఈ దేశాన్ని గాడ్సే దేశంగా మార్చేందుకు అనుమతించదని ముఫ్తీ చెప్పారు.
ఎన్నికలు జరగనున్న యూపీలో బాబర్, ఔరంగజేబు వంటి మొఘల్ పాలకుల పేర్లను బీజేపీ ప్రచారం చేస్తోందని.. పాలనలో విఫలమైనందునే గుళ్లు, మసీదుల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైన వారు.. కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోడీ హయాంలో దేశంలో పేదలు మరింత పేదలుగా మారారని, సంపన్నుల జాబితా పెరిగిపోయిందని తెలిపారు. ఇటీవల కశ్మీర్ లోయలో ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) కింద ఓ జర్నలిస్టును అరెస్టు చేయడంపై ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, యువత మాత్రం అధికార పార్టీ బెదిరింపులకు వెనకడుగు వేయకుండా.. అహింసాయుతంగా, ప్రేమ, స్నేహా సందేశాలను చాటుతూ దేశ సవాళ్లకు దీటుగా నిలబడాలని కోరారు. పీడీపీ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించిన గిరిజన యువజన సదస్సులో ముఫ్తీ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు. బీజేపీ నేతలు దేశాన్ని నాశనం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఈడీ, ఇతర ప్రభుత్వ సంస్థల దాడులు, అరెస్టులు నిత్యకృత్యంగా మారాయి. కశ్మీర్ పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దారుణంగా మారింది. అని దుయ్యబట్టారు.
అంతేకాదు.. చరిత్ర అందరికీ ఓ అవకాశాన్ని ఇస్తుందని, బ్రిటీషర్ల నుంచి విముక్తి కోసం దేశ ప్రజలు గతంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఇప్పుడు బీజేపీని వదిలించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. అయితే.. ఇది స్వాతంత్య్రం కంటే పెద్దదని.. ఎందుకంటే బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోందని ముఫ్తీ అన్నారు. జమ్ముకశ్మీర్ అనేది మహాత్మా గాంధీ భారత్లో చేరిందని.. ఈ దేశాన్ని గాడ్సే దేశంగా మార్చేందుకు అనుమతించదని ముఫ్తీ చెప్పారు.
ఎన్నికలు జరగనున్న యూపీలో బాబర్, ఔరంగజేబు వంటి మొఘల్ పాలకుల పేర్లను బీజేపీ ప్రచారం చేస్తోందని.. పాలనలో విఫలమైనందునే గుళ్లు, మసీదుల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైన వారు.. కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోడీ హయాంలో దేశంలో పేదలు మరింత పేదలుగా మారారని, సంపన్నుల జాబితా పెరిగిపోయిందని తెలిపారు. ఇటీవల కశ్మీర్ లోయలో ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) కింద ఓ జర్నలిస్టును అరెస్టు చేయడంపై ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు.