Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే మేనల్లుడి తల తెస్తే రూ. 51 లక్షలు !

By:  Tupaki Desk   |   15 Aug 2020 4:20 PM IST
ఎమ్మెల్యే మేనల్లుడి తల తెస్తే రూ. 51 లక్షలు !
X
సాధారణంగా ఆదివారం రోజు మేక తల , పొట్టేలు తలకి రేటు ఫిక్స్ చేసినట్టు , మీరట్ కు చెందిన ముస్లీం మతపెద్ద, ప్రముఖ వ్యాపారి షహజీబ్ రిజ్వి మనిషి తలకి వెల కట్టాడు. ఇటీవలే తాజాగా బెంగళూరులో అల్లర్లు జరగడానికి, హింస చెలరేగడానికి కారణం అయ్యాడని, ఎమ్మెల్యే మేనల్లుడి తల నరికి తెస్తే రూ. 50 లక్షల నజరానాగా ఇస్తానని ప్రకటించాడు.

కర్ణాటక, కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గం దేవుడిని కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆ పోస్టును షేర్ చేశాడని ఆరోపిస్తూ గత మంగళవారం రాత్రి ఓ వర్గం వాళ్లు హింసకి దిగారు. ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు కనపడిన వాహనాలు, అంబులెన్స్ లు, బైక్ లు, కార్లు, పోలీసు జీపులను కాల్చి బూడిద చేశారు. బెంగళూరు లో హింసను అరికట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో అల్లర్లకు పాల్పడిన వారిలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసుల కాల్పులతో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ మొత్తం ఘటనకి కారణంగా ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ . నవీన్ ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ ప్రకటించారు

అయితే , నవీన్ పోస్ట్ పై , ఆ జరిగిన అల్లర్ల పై ఉత్తరప్రదేశ్ లోని మీటర్ కు చెందిన మత పెద్ద, వ్యాపారి షహజీబ్ రిజ్వి ,, ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్‌ తల తెస్తే రూ. 50 లక్షలు నజరానాగా ఇస్తానని మీరట్‌ కు చెందిన షహజీబ్‌ రిజ్వి అనే వ్యక్తి శుక్రవారం ట్వీట్‌ చేశారు. నవీన్ ఫేస్ బుక్ లో మన దేవుడిని కించపరిచి పోస్టు చేశాడని, ముగ్గురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని, అతని తల నరికి తనకు తెచ్చివ్వాలని షహజీబ్ రిజ్వి ఆవేశంగా చెబుతున్న వీడియో బయటకు రావడంతో కలకలం రేపింది.