Begin typing your search above and press return to search.
డిప్రెషన్ లో ఉద్యోగులు.. కారణం ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 18 May 2020 5:00 PM ISTప్రస్తుత సంక్షోభం కారణంగా ఎవ్వరూ మనసు పెట్టి పనిచేసే వాతావరణం కనిపించడం లేదు. ఈ మహమ్మారితో ఉద్యోగ భద్రత.. జీవనం.. జీవితం గందరగోళంగా మారింది. సగం జీతాలతోపాటు అసలు ఉద్యోగాలు ఉంటాయో పోతాయోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. ఉద్యోగులు, ముఖ్యంగా ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన యువ ఎంప్లాయిస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందట. వారంతా ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందోననే దానిపై తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఉద్యోగ అభద్రత లేకపోవడం.. వర్క్ ఫ్రం హోంతో ఇబ్బందులతో జీవితం అనిశ్చితిగా మారిందంటున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు తీవ్ర నిరాశ.. ఆందోళనతో పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
మావెరిక్స్ ఇండియా ఇటీవల నిర్వహించిన “రీబూటింగ్ 2020: ఎ స్టోరీ ఆఫ్ మహమ్మారి, షిఫ్టింగ్ పర్సెప్షన్స్” ప్రకారం.. 61 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకుండా తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారని తేల్చారు. పని భారం పెరిగిందని మహిళా ఉద్యోగులు భావిస్తుండగా, పురుష ఉద్యోగులు తమ ఉద్యోగాల భవిష్యత్తు మసకబారినట్లు భావిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం కంటే ఆఫీసు నుండి పనిచేయడం మంచిదని భావిస్తారు. పని వాతావరణం లేకపోవడం.. పిల్లలు, భార్య పోరుతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నారు. ఇక సరైన సౌకర్యాలు ఇంట్లో లేకపోవడం కూడా మరో కారణంగా ఉంది. 75 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాలనుకుంటున్నారు. అయితే మేనేజ్ మెంట్ల ధోరణి భిన్నంగా ఉంది. ఉద్యోగులతో ఇంటి నుండి పని వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుందని మేనేజ్మెంట్లు భావిస్తున్నాయి.
కనీసం 90 శాతం మంది నిపుణులు ప్రస్తుత పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ తిరిగి పునరుద్ధరించడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడినపడడానికి కనీసం రెండేళ్ళకు పైగా పడుతుందని 26 శాతం మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. దీంతో రాబోయే ఆరు నెలల వరకు కనీసం 67 శాతం మంది ఉద్యోగులంతా అడుగు బయటపెట్టకుండా ఇంట్లోనే బందీ అయిపోవాల్సిన పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు. వారి బయటి పర్యాటనలకు విఘాతం కలుగవచ్చు.
మావెరిక్స్ ఇండియా ఇటీవల నిర్వహించిన “రీబూటింగ్ 2020: ఎ స్టోరీ ఆఫ్ మహమ్మారి, షిఫ్టింగ్ పర్సెప్షన్స్” ప్రకారం.. 61 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకుండా తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారని తేల్చారు. పని భారం పెరిగిందని మహిళా ఉద్యోగులు భావిస్తుండగా, పురుష ఉద్యోగులు తమ ఉద్యోగాల భవిష్యత్తు మసకబారినట్లు భావిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం కంటే ఆఫీసు నుండి పనిచేయడం మంచిదని భావిస్తారు. పని వాతావరణం లేకపోవడం.. పిల్లలు, భార్య పోరుతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నారు. ఇక సరైన సౌకర్యాలు ఇంట్లో లేకపోవడం కూడా మరో కారణంగా ఉంది. 75 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాలనుకుంటున్నారు. అయితే మేనేజ్ మెంట్ల ధోరణి భిన్నంగా ఉంది. ఉద్యోగులతో ఇంటి నుండి పని వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుందని మేనేజ్మెంట్లు భావిస్తున్నాయి.
కనీసం 90 శాతం మంది నిపుణులు ప్రస్తుత పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ తిరిగి పునరుద్ధరించడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడినపడడానికి కనీసం రెండేళ్ళకు పైగా పడుతుందని 26 శాతం మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. దీంతో రాబోయే ఆరు నెలల వరకు కనీసం 67 శాతం మంది ఉద్యోగులంతా అడుగు బయటపెట్టకుండా ఇంట్లోనే బందీ అయిపోవాల్సిన పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు. వారి బయటి పర్యాటనలకు విఘాతం కలుగవచ్చు.
