Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ నేతను చంపేసిన మావోలు..ఉలిక్కిపడ్డ ఉత్తర తెలంగాణ
By: Tupaki Desk | 11 Oct 2020 10:45 AM ISTతెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు అడుగుపెట్టారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. సరిహద్దు జిల్లాలైన కుమ్రంభీం ఆసిఫాబా, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఇప్పటికే మావోయిస్టులు తిష్ట వేశారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు కూడా కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఏకంగా డీజీపీ మహేందర్రెడ్డి అనుమానాస్పద ప్రాంతాల్లో పర్యటించారు. అయితే ఇప్పడు జరిగిన ఓ ఘటన మాత్రం యావత్ తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి అధికారిక పార్టీకి చెందిన ఓ నేతను మావోయిస్టులు పొట్టన పెట్టకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత మాడురి భీమేశ్వర్ రావును శనివారం అర్ధరాత్రి మావోయిస్టులు హత్యచేశారు. ఇంట్లో నిద్రిస్తున్న భీమేశ్వర్ రావును విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటనతో ఉత్తర తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఘటనా స్థలంలో వారు లేఖ వదిలి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ‘భీమేశ్వర్రావు అధికార పార్టీలో కొనసాగుతూ అరాచకాలు చేస్తున్నాడు. పేద ప్రజలను దోచుకుంటున్నాడు. అందుకే అతడిని హతమార్చాం. ఇంకా మా హిట్లిస్ట్లో చాలామంది ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే భీమేశ్వర్కు పట్టిన గతే వాళ్లకు పడుతుంది’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. రానున్న రోజుల్లో పోలీసులు కుంబింగ్ను మరింత తీవ్రతరం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అటవీప్రాంతాలన్నీ జల్లెడ పడతారని సమాచారం.
ఘటనా స్థలంలో వారు లేఖ వదిలి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ‘భీమేశ్వర్రావు అధికార పార్టీలో కొనసాగుతూ అరాచకాలు చేస్తున్నాడు. పేద ప్రజలను దోచుకుంటున్నాడు. అందుకే అతడిని హతమార్చాం. ఇంకా మా హిట్లిస్ట్లో చాలామంది ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే భీమేశ్వర్కు పట్టిన గతే వాళ్లకు పడుతుంది’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. రానున్న రోజుల్లో పోలీసులు కుంబింగ్ను మరింత తీవ్రతరం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అటవీప్రాంతాలన్నీ జల్లెడ పడతారని సమాచారం.
