Begin typing your search above and press return to search.

అధికార లాంఛనాలతో మాణిక్యాలరావు అంత్యక్రియలు పూర్తి

By:  Tupaki Desk   |   2 Aug 2020 9:20 AM IST
అధికార లాంఛనాలతో మాణిక్యాలరావు అంత్యక్రియలు పూర్తి
X
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వం అధికార లంఛనాలతో పూర్తి చేసింది. తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశనావాటికలో నిర్వహించారు.

మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం హాజరు కావడం గమనార్హం.

మాణిక్యాలరావు కరోనా వైరస్ తో మరణించడంతో కేవలం 20మందికి మాత్రమే అనుమతిచ్చారు. పోలీసు అధికారుల సమక్షంలో అధికారికంగా అంత్యక్రియలను ముగించారు.

సీఎం జగన్ సైతం మాణిక్యాలరావు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారికంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.