Begin typing your search above and press return to search.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై వైసీపీ స‌ర్కారు నిర్లక్ష్యం: మంద కృష్ణ ఫైర్‌

By:  Tupaki Desk   |   16 May 2022 2:30 PM GMT
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై వైసీపీ స‌ర్కారు నిర్లక్ష్యం:  మంద కృష్ణ ఫైర్‌
X
వైసీపీ ప్ర‌భుత్వంపై మాదిగ రిజ‌ర్వేస‌న్ పోరాట స‌మితి(ఎమ్మార్పీఎస్) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే.. అందుకు కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని మందకృష్ణ మాదిగ గుర్తుచేశారు. అయితే.. ఎస్సీ వర్గీకరణ పట్ల వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉందన్నారు.

ఎస్సీ వర్గీకరణ పట్ల వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే.. అందుకు కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు వల్లే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని తెలిపారు. విజయవాడలో టీడీపీ నేత వర్ల రామయ్యను మందకృష్ణ మాదిగ ఆయన నివాసంలో కలిశారు.

కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న ఆయన.. చంద్రబాబు దీనిపై చొరవ తీసుకోవాలని కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని వర్లరామయ్యను కోరారు. ఎన్నికల్లో సీట్లకు సంబంధించి మాల-మాదిగ, రెల్లి ప్రజలకు 50-50 నిష్పత్తిలో సీట్లు కేటాయించేలా చొరవ చూపాలన్నారు.

ఎస్సీలందరికీ సమాన రాయితీ ఫలాలు దక్కేలా మందకృష్ణ కృషి చేస్తున్నారని వర్లరామయ్య అన్నారు. మందకృష్ణ లెవనెత్తే అంశాలన్నీ టీడీపీ ఆలోచనల్లో ఉన్నవేనని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు.. వైసీపీ హ‌యాంలో మాదిగ సామాజిక వ‌ర్గంపై దాడులు పెరిగాయ‌ని అన్నారు.

వారికి గ‌త ప్ర‌భుత్వం అందించిన సంక్షేమాన్ని కూడా అందించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి విష‌యంలోనూ వైసీపీ ప్ర‌భుత్వం మాదిగ‌ల ప‌ట్ల వివ‌క్ష చూపిస్తోంద‌ని విమ‌ర్శించారు. దీనిపై త్వ‌ర‌లోనే ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌న్నారు.