Begin typing your search above and press return to search.

భర్య - అత్త - మరదలను చంపి..శవాలపై అత్యాచారం!

By:  Tupaki Desk   |   28 Sept 2020 6:00 AM IST
భర్య - అత్త - మరదలను చంపి..శవాలపై అత్యాచారం!
X
సభ్యసమాజంలో క్రూరత్వం పెరిగిపోతోంది. మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. భర్య, అత్త, మరదలును దారుణంగా హత్య చేసిన ఓ కిరాతకుడు అంతటితో ఆగకుండా వారి శవాలతో శృంగారం చేసిన దారుణ ఘోరం వెలుగుచూసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘట హర్యానాలోని పానిపట్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.

సోనెపత్ జిల్లా పట్టి కలియానా గ్రామానికి చెందిన నూర్ హాసన్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని.. అత్త, మరదలు సహాయం చేస్తున్నారని భావించాడు. దీంతో వారిపై కక్ష పెంచుకొని హత్యకు పథకం రచించాడు.

కొద్దిరోజుల క్రితం భార్య, మరదలికి మత్తు మందు ఇచ్చి కత్తితో నరికి చంపేశాడు. అనంతరం వారి శవాలతో శృంగారం చేశాడు. ఆ వెంటనే మృతదేహాలను దుప్పట్లో చుట్టి దూరంగా పడేశాడు.

మూడు రోజుల తర్వాత అత్తాగారి ఊరికి వెళ్లి ఆమెను తీసుకొచ్చి చంపేసి ఆమె శవంతో కూడా శృంగారం చేశాడు. ఆ తర్వాత శవాన్ని మంటల్లో తగులబెట్టాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఆ ముగ్గురి శవాలు మూడు వేరు వేరు ప్రదేశాల్లో వారికి లభించాయి.

హాసన్ పై అనుమానంతో అతడిని ప్రశ్నించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో గురువారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.