Begin typing your search above and press return to search.

కంపెనీ పనిపై 17 రోజులు ఢిల్లీలో.. యజమాని కిడ్నాప్‌ చేసి ప్రైవేటు భాగాల పై శానిటైజర్‌!

By:  Tupaki Desk   |   7 July 2020 5:00 AM IST
కంపెనీ పనిపై 17 రోజులు ఢిల్లీలో.. యజమాని కిడ్నాప్‌ చేసి ప్రైవేటు భాగాల పై శానిటైజర్‌!
X
కంపెనీ పని పై ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ ఉద్యోగి పై పుణెలోని ఓ కంపెనీ యజమాని అమానుషంగా ప్రవర్తించిన ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ సొమ్ము సొంతానికి వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి అనేక చిత్రహింసలకు గురిచేశాడు. రెండు రోజులపాటు బంధించి వదిలేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పూర్తి వివరాలు చూస్తే ... పెయింటింగ్స్‌ ఎగ్జిబిషన్‌ కంపెనీ లో మేనేజర్ ‌గా పనిచేసే ఓ వ్యక్తి, కంపెనీ పనిమీద మార్చిలో ఢిల్లీ వెళ్లాడు. లాక్‌ డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన అతను మే 7న తిరిగి పుణెలోని సొంతూరు కొత్రూడ్‌ వచ్చాడు. కరోనా నేపథ్యంలో అతన్ని 17 రోజులపాటు హోటల్ ‌లో ఉండాలని సంస్థ యజమాని చెప్పాడు. అయితే, క్వారంటైన్‌ పూర్తి చేసుకుని కంపెనీకి వచ్చిన అతనిపై యజమాని రెచ్చిపోయాడు.

ఢిల్లీలో, తిరిగి వచ్చిన తర్వాత పుణెలో అతను ఖర్చు చేసిన మొత్తం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. కంపెనీ పనిమీద వెళ్లిన తను డబ్బులు ఎలా ఇవ్వాలని మేనేజర్‌ అతన్ని ప్రశ్నించాడు. దీంతో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి యజమాని మేనేజర్‌ ను జూన్‌ 13న కిడ్నాప్‌ చేశాడు. రెండురోజులపాటు బంధించి.. ప్రైవేటు భాగాలపై శానిటైజర్‌ పూసి అనేక విధంగా‌ చేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.