Begin typing your search above and press return to search.

మీ డ్యూటీలు మీ దేవాలయాల వద్ద చేసుకోండి.. ఎంఐఎం కార్పొరేటర్!

By:  Tupaki Desk   |   1 May 2020 12:10 PM GMT
మీ డ్యూటీలు మీ దేవాలయాల వద్ద చేసుకోండి.. ఎంఐఎం కార్పొరేటర్!
X
కరోనా కష్ట కాలంలో ప్రాణాలని సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నిన్న బైక్ ఆపినందుకు ఒక వ్యక్తి నోటికొచ్చిన బూతులు తిట్టి పోలీసుల మీద చెయ్యెత్తాడు . ఇక తాజాగా ఎంఐఎం కార్పొరేటర్, అతని అనుచరులు పోలీసులపై రెచ్చిపోయారు. మాదన్నపేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని చావని ప్రాంతంలో బందోబస్తు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై కార్పొరేటర్ బెదిరింపులకు పాల్పడ్డారు. మసీదు వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. హిందూ దేవాలయాల వద్ద వెళ్లి డ్యూటీ చేసుకోండి అని మతం రంగు పులుముతూ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ‘మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ’ పోలీసు సిబ్బందికి సవాల్ విసిరాడు. ఇది వైరల్ కావటంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది. ఇక ఆ ఎంఐఎం కార్పోరేట్‌, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ విషయంపై కార్పొరేటర్ వాదన మరోలా ఉంది. మసీదుకు తాళం వేయాలంటూ వారు బెదిరించారని చెప్తున్నారు .ఇక తాము మసీదుకు తాళం వెయ్యాల్సిందిగా వచ్చిన పర్మిషన్ లెటర్ చూపించమన్నానని తెలిపారు. దాన్ని చూపించకుండా ప్రజలను బెదరించారని అందుకే కోప్పడ్డానని కార్పొరేటర్ తెలిపారు.