Begin typing your search above and press return to search.

'మాగంటి'' పుంజు కూత పెట్టింది

By:  Tupaki Desk   |   13 Jan 2016 6:15 AM GMT
మాగంటి పుంజు కూత పెట్టింది
X
సంక్రాంతి పండగ సమయంలో ఎవరైనా పండగ శుభాకాంక్షలు చెబుతారు. కానీ.. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాత్రం ప్రజలందరికీ కోడి పందాల శుభాకాంక్షలు చెప్తున్నారు. నిషేధాలు - ఆదేశాలు వంటివేమీ లెక్కచేయకుండా కోడిపందేలకు ప్రజలను పురిగొల్పడంలో ముందుండే మాగంటి బాబు ఈసారి కూడా పందాల సీజన్ రాగానే హుషారొచ్చేసింది. అందుకే ఆయన ప్రజలకు ఏకంగా ''కోడి పందేల శుభాకాంక్షలు" అంటూ విషెస్ చెప్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మార్కెట్‌ యార్డులో ఉండి ఎమ్మెల్యే శివరామరాజు సంక్రాంతి సంబరాలను వైభవంగా జరిపారు. ఆ కార్యక్రమానికి మాగంటి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ - ఎమ్మెల్యేలు కోడి పుంజులను పట్టుకుని వాటిని ఢీకొడుతూ ఇవి డింకీ పందాలంటూ సరదాగా వేశారు. మరో ప్రాంతంలో సరదాగా గొర్రె పందాలు వేశారు. సంక్రాంతి అంటేనే సరదా అంటూ సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసుకున్నారు. సాక్షాత్తు ఎంపీగారే ప్రజలకు కోడిపందేల శుభాకాంక్షలు చెప్పడం వారిని పందేలకు రెడీ అయిపోండి.. అంతా నేను చూసుకుంటాను అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేనని అంటున్నారు.