Begin typing your search above and press return to search.

ప్రియురాలిని తీసుకెళ్లడానికి అత్తింటికి ప్రియుడు..కానీ - అక్కడ గొడవలో..!

By:  Tupaki Desk   |   25 Dec 2020 11:30 AM GMT
ప్రియురాలిని తీసుకెళ్లడానికి అత్తింటికి ప్రియుడు..కానీ - అక్కడ గొడవలో..!
X
ప్రేమించిన యువతికి పెళ్లి కావడం తో తట్టుకోలేని ప్రియుడు , అత్తింటికి అర్ధరాత్రి సమయంలో స్నేహితులని తీసుకోని వెళ్లగా , అక్కడ భర్త , మామ అడ్డుకున్నారు. అక్కడ జరిగిన గొడవలో చివరికి ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన యూపీలోని డియోరియా జిల్లాలో జరిగింది. యూపీ సరిహద్దు బిహార్ ‌లోని శివన్‌ కి చెందిన పంకజ్ మిశ్రా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే ఆమెకు ఈ నెల 8న డియోరియా జిల్లాకి చెందిన వికాస్ పాండేతో వివాహం జరిగింది.

ప్రియురాలికి పెళ్లైపోవడంతో తట్టుకోలేకపోయిన పంకజ్.. ఆమెను ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి వేళ తన స్నేహితులతో కలసి ఆమె అత్తింటికి వెళ్లాడు. కొత్త కోడలిని తీసుకెళ్లేందుకు వచ్చిన యువకులను చూసి ఆమె భర్త, మామ అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో భర్త వికాస్ పాండే, మామ జితేంద్ర పాండేకి గాయాలయ్యాయి. ఆ విషయం గ్రామస్తులకు తెలియడంతో వెంటనే పంకజ్‌ మిశ్రాని చుట్టుముట్టి నాలుగు తగిలించారు. స్థానికులు చావబాదడంతో ప్రియుడు పంకజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంకజ్‌ ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పంకజ్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.