Begin typing your search above and press return to search.

పెళ్లైన వ్యక్తితో ప్రేమ... ఆ విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే ?

By:  Tupaki Desk   |   12 March 2021 11:30 PM GMT
పెళ్లైన వ్యక్తితో ప్రేమ... ఆ విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే ?
X
ఈ సామాజంలో ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు కళ్ల ముందే జరుగుతున్నా కూడా అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతునే ఉన్నారు. మోసగాళ్లను నమ్మ వారి ప్రేమ ఉచ్చులో పడి జీవితాల్ని నాశనం చేసుకొని చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో తాను మోసపోయానని కుమిలిపోతూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భదాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసకుంది.

వివరాల్లోకి వెళ్తే .. భదాద్రి కొత్తగూడెం జిల్లాలో మాలబంజర గ్రామానికి చెందిన ఓ యువతి ఖమ్మం పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌ లో సహాయకురాలిగా పనిచేసేది. ఆ సమయంలో నగరానికి చెందిన ఆటో డ్రైవర్‌ ‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజులకి ప్రేమగా మారింది. ప్రేమించిన వ్యక్తిపై అమితమైన నమ్మకంతో ఆ యువతి అతనితో కొంచెం ఎక్కువ చనువుగా మెలుగుతూ వచ్చింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ ఆటో డ్రైవర్ కి ఇదివరకే పెళ్లి అయ్యింది. అయితే అతను ఆ విషయాన్ని యువతి వద్ద దాచి , ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.

అయితే, ఆ యువతికి తాను ప్రేమించే వ్యక్తికి ఇప్పటికే పెళ్లైయినా విషయం తెలిసింది. ఆటో డ్రైవర్ బంధువుల్లో ఒకరు ఈ విషయాన్ని యువతికి చెప్పాడు. అలాగే , అతడితో ‌ తో సన్నిహితంగా ఉండొద్దంటూ హెచ్చరించాడు. ఈ విషయం తెలిసి ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందింది. తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి .. తనను మోసం చేశాడంటూ బాధపడింది. ఈ క్రమంలోనే యువతి మార్చి 8న మాలబంజరలోని తన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పటీ అదే ఆలోచిస్తూ గడిపి, మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు తొలుత ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత , మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతిచెందింది. ఇక, యువతి బంధువుల ఫిర్యాదు మేరకు సుజాతనగర్‌ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. వివరాలు సేకరించి విచారణ మొదలుపెట్టారు.