Begin typing your search above and press return to search.
బెంగుళూరు తర్వాతే లండన్ !
By: Tupaki Desk | 15 Jan 2021 11:26 AM ISTకర్ణాటక రాజధాని బెంగళూరుకు తాజాగా ఓ అరుదైన ఘనత దక్కించుకుంది. ఇప్పటికే ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించుకున్న ఈ మహానగరం ..తాజాగా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్ నగరం గా నిలిచింది. బెంగళూరు తర్వాతి స్థానాల్లో యురోపియన్ నగరాలైన లండన్, మ్యూనిచ్, బెర్లిన్, పారిస్ నిలిచాయి.
ఇక భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఆరోస్థానంలో ఉంది. 2016 నుంచి 2020 మధ్య ఆయా నగరాల్లో వచ్చిన పెట్టుబడుల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. ఈ మధ్య కాలంలో బెంగళూరులో పెట్టుబడులు ఏకంగా 5.4 రెట్లు పెరగడం విశేషం. 2016లో 130 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉండగా.. 2020 నాటికి అది 720 కోట్ల డాలర్లకు చేరింది. అదే ముంబైలో మాత్రం 70 కోట్ల డాలర్ల నుంచి 120 కోట్ల డాలర్లకు చేరింది.
ఇక వరల్డ్స్ టెక్ వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడులలోనూ ప్రపంచంలో బెంగళూరుకు 6వ ర్యాంకు లభించింది. ఇందులో టాప్ ప్లేస్లో బీజింగ్ నిలవగా.. ఆ తర్వాత శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ ఉన్నాయి. ముంబైకి 21వ స్థానం దక్కింది. మొత్తానికి మన బెంగళూరు ఈ అరుదైన రికార్డు సొంత చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం పరిచారు .
ఇక భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఆరోస్థానంలో ఉంది. 2016 నుంచి 2020 మధ్య ఆయా నగరాల్లో వచ్చిన పెట్టుబడుల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. ఈ మధ్య కాలంలో బెంగళూరులో పెట్టుబడులు ఏకంగా 5.4 రెట్లు పెరగడం విశేషం. 2016లో 130 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉండగా.. 2020 నాటికి అది 720 కోట్ల డాలర్లకు చేరింది. అదే ముంబైలో మాత్రం 70 కోట్ల డాలర్ల నుంచి 120 కోట్ల డాలర్లకు చేరింది.
ఇక వరల్డ్స్ టెక్ వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడులలోనూ ప్రపంచంలో బెంగళూరుకు 6వ ర్యాంకు లభించింది. ఇందులో టాప్ ప్లేస్లో బీజింగ్ నిలవగా.. ఆ తర్వాత శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ ఉన్నాయి. ముంబైకి 21వ స్థానం దక్కింది. మొత్తానికి మన బెంగళూరు ఈ అరుదైన రికార్డు సొంత చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం పరిచారు .
