Begin typing your search above and press return to search.

పరీక్షలు అయి పోయాయని.. రైలు పట్టాల మీద మందు పార్టీ

By:  Tupaki Desk   |   15 Nov 2019 5:06 AM GMT
పరీక్షలు అయి పోయాయని.. రైలు పట్టాల మీద మందు పార్టీ
X
ఆనందాన్ని వెరైటీ గా సెలబ్రేట్ చేసుకోవాలన్న పిచ్చతో ఐదుగురు కుర్రాళ్లు చేసిన పని నాలుగు కుటుంబాల్ని తీవ్ర విషాదం లో నింపటమే కాదు.. వారి తల్లిదండ్రుల కు తీర్చ లేని కడుపు కోతను మిగిల్చింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ ఐదుగురు విద్యార్థులు చేసిన పనికి విస్తు పోతున్నారు. తమిళనాడుకు చెందిన వీరంతా ఇంజనీరింగ్ చేస్తున్నారు.

ఎగ్జామ్స్ అయి పోయాయన్న ఆనందాన్ని వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా వెన్నెల వెలుగు లో రైలు పట్టాల మీద కూర్చొని పూటు గా మందు కొడితే వచ్చే కిక్కే వేరన్నట్లు గా భారీ ప్లాన్ వేశారు. అందుకు తగ్గట్లే సరంజామా మొత్తాన్ని సిద్ధం చేసుకున్నారు. కదల్లేనంతగా తాగారు.. చివర కు రైలు వచ్చే సమయానికి మత్తు లో మునిగిపోయి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన వైనం తాజాగా చోటు చేసుకుంది.

తమిళనాడు లోని కోయంబత్తూరు కు సమీపం లోని రావత్తూరు రైల్వే వంతెన సమీపం లోని రైలు పట్టాల మీద జరిగిన ఈ విషాద ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు (కొడైకెనాల్ కు చెంది రాజు(22), రాజశేఖర్ (22), రాజపాళయం కు చెందిన కరుప్పుస్వామి (22), 22 ఏళ్ల గౌతమ్) పరీక్షలు పూర్తి అయ్యాయన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రాత్రి వేళ రైలు పట్టాల మీద మందు తాగాలని డిసైడ్ అయ్యారు. అయితే.. విపరీతం గా తాగటం తో కదల్లేని స్థితిలో ఉన్నారు. పట్టాల పై ఐదుగురు కుర్రాళ్లు ఉన్న విషయాన్ని గుర్తించిన డ్రైవర్ పెద్ద ఎత్తున హారన్ కొట్టినా ప్రయోజనం లేక పోయింది.

వారిని రక్షించేందుకు బ్రేకులు వేశారు కానీ.. రైలు వంతెన దాటిన తర్వాత ఆగింది. దీంతో.. కింద కు దిగిన డ్రైవర్ ఘటనా స్థలానికి చేరుకో గా.. నలుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు తీవ్రగాయాల కు గురయ్యారు. అతడ్ని ఆసుపత్రి కి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. అతడ్ని తేనికి చెందిన విశ్వేషన్ గా గుర్తించారు. ఎంత వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవాలంటే మాత్రం.. మరీ ఇలానా? అంటూ అవాక్కవుతున్నారు.