Begin typing your search above and press return to search.

ఎల్​ఈడీ లైట్లతో కరోనా ఖతం..! పరిశోధనలో వెల్లడైన షాకింగ్​ నిజం..!

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:48 PM IST
ఎల్​ఈడీ లైట్లతో కరోనా ఖతం..! పరిశోధనలో వెల్లడైన షాకింగ్​ నిజం..!
X
ప్రపంచాన్ని తలకిందులు చేసిన ‘కరోనా’ వైరస్​పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మందులు కనిపెట్టాలని రాత్రింబవళ్లు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. మొదట్లో కరోనా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక ప్రాంతంలో ఒక మనిషికి కరోనా వైరస్ సోకినా ఎంత మందికి కూడా వైరస్ సోకేది. ఒక కేసు నమోదు అయిన ప్రాంతంలో కూడా అధికారులు రెడ్ జోన్ ప్రకటించి జనాలు అటూ ఇటూ తిరగకుండా జాగ్రత్తలు సైతం తీసుకున్నారు.

అయితే తర్వాత ప్రజల్లో రోగనిరోధకశక్తి పెరగడంతో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. కేసులు నమోదు కూడా తగ్గిపోయాయి. మరణాల సంఖ్య కూడా ముందుటితో పోలిస్తే బాగా తగ్గింది. మనదేశంలో కూడా తొలుత కరోనా కేసులు భయంకరస్థాయిలో బయటపడ్డాయి. అయితే ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గాయి. ప్రజల్లో హెర్డ్​ ఇమ్యూనిటీ పెరగడమే అందుకు కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే తాజాగా ఎల్ఈడీ లైట్లతో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అల్ట్రా వయోలెట్‌ కిరణాలతో కరోనా వైరస్‌ చనిపోతుందని శాస్త్రవేత్తలు గతంలోనే నిరూపించారు.

ఎల్‌ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయోలెట్‌ కిరణాలతో కూడా వైరస్‌ను 99.9 శాతం చంపవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్‌ హదాస్‌ మమేన్‌ నిరూపించారు. గదుల్లో, ఇళ్లలో కరోనా వైరస్‌ లేకుండా చేయడానికి వెంటిలేటర్ల వద్ద, ఏసీ గదుల్లో గాలీ పీల్చుకునే ఏసీ వెంటిలేటర్ల వద్ద ఎల్‌ఈడీ బల్బులను అమర్చుకోవాలని, బస్సుల్లో, రైళ్లలో, క్రీడా ప్రాంగణాల్లో శాస్త్రీయంగా ఆలోచించి ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలని ఆయన సూచించారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎల్​ఈడీ లైట్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన సూచిస్తున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే చోట్లలో వీటిని అమర్చాలని అంటున్నారు.