Begin typing your search above and press return to search.

అమరావతిలో 40వేల కోట్ల కుంభకోణం

By:  Tupaki Desk   |   20 Sept 2020 9:00 PM IST
అమరావతిలో 40వేల కోట్ల కుంభకోణం
X
గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమరావతి భూకుంభకోణంపై ఇప్పటికే సీబీఐ విచారణ దిశగా వైఎస్ జగన్ సర్కార్ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందే నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారని వైసీపీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అతడి పార్టీ పెద్దలు మొత్తంగా 40వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలు, సుప్రీం కోర్టు జడ్జీలు సైతం ఈ భూములు పొందారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి కోర్టులు అడ్డుపడుతున్నాయని శ్రీధర్ అన్నారు. కోర్టులు ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నాయని కామెంట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో రాష్ట్రమంతా తమ పార్టీకి మంచి మర్యాద ఉందని.. వచ్చే ఎన్నికల్లో 151 మించి సీట్లు గెలుచుకుంటామని ఆయన అన్నారు.