Begin typing your search above and press return to search.

మీ ఆయన ఫామ్​లో లేడు.. మీరు దుబాయ్​ వెళ్లండి ప్లీజ్.. రసెల్​ భార్యకు మెసేజ్​

By:  Tupaki Desk   |   9 Oct 2020 11:15 AM IST
మీ ఆయన ఫామ్​లో లేడు.. మీరు  దుబాయ్​ వెళ్లండి  ప్లీజ్.. రసెల్​ భార్యకు మెసేజ్​
X
ఐపీఎల్​ జరిగిన ప్రతిసారి క్రికెటర్ల భార్యలను బయటకు లాగడం కామన్​గా మారిపోయింది. ఇప్పటికే కోహ్లీ సరిగ్గా ఆడటం లేదంటూ ప్రముఖ కామెంటర్​ సునీల్​ గవాస్కర్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడో అభిమాని చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. కోల్​కతా నైట్​రైడర్స్​ ఆండ్రీ రస్సెల్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. నిజానికి రస్సెల్ ఆల్​రౌండర్​.. ఫీల్డింగ్​, బౌలింగ్​, బ్యాటింగ్​ అన్ని విభాగాల్లోనూ భయంకరంగా రాణించగలడు. అయితే ప్రస్తుత సీజన్​లో రస్సెల్​ కొంత ఫామ్​ కోల్పోయాడు. ఈ సీజన్‌లో బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌ లో తేలి పోతున్నాడు. తన సామర్థ్యానికి తగినట్టుగా ఆడట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లను ఆడిన ఆండ్రీ రస్సెల్.. 50 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 24. బ్యాటింగ్ సగటు 12.50 మాత్రమే. దీంతో రస్సెల్​ అభిమానులు, కోల్​కతా నైట్ ​రైడర్స్​ ఫ్యాన్స్​ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఏకంగా ఓ ఫ్యాన్​ రస్సెల్ భార్య జస్సిమ్ లోరాకు మెసేజ్​ పెట్టారు. ఈ మెసేజ్​ ప్రస్తుతం వైరల్​గా మారింది. ‘ఆంటీ రస్సెల్​ సరిగ్గా ఆడటం లేదు. మీరు పక్కన లేకపోవడంతో అతడు ఫామ్​ కోల్పోయినట్టు ఉన్నాడు. మీరు వెంటనే దుబాయ్​ వెళ్లి రస్సెల్​ను ఉత్సాహపరచండి’ అంటూ సోషల్​మీడియా ద్వారా మెసేజ్​ పెట్టాడు. దీనికి ఆమె కూడా రిప్లయ్ ఇచ్చారు. ‘రస్సెల్​ తప్పకుండా ఫామ్​లోకి వస్తాడు. ఇంకా చాలా మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ముందుముందు రస్సెల్ విజృంభన చూస్తారు’ తాను దుబాయ్​ వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆమె పేర్కొన్నారు.

ఫ్యామిలీ లేక డీలా పడుతున్నారా?

ప్రతి ఐపీఎల్​ సీజన్​లో క్రికెటర్ల వెంట వాళ్ల భార్య, పిల్లలు వెళ్తుంటారు. ఈ సారి కరోనాతో ఎవరూ వెళ్లలేకపోయారు. బయో సెక్యూర్ బబుల్‌ ను విధానంలో ఐపీఎల్ టోర్నమెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకు కూడా అనుమతి లేదు. అయితే భార్యలు లేకపోవడం వల్లే క్రికెటర్లు కొంత డిప్రెషన్​ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.