Begin typing your search above and press return to search.

కేఈని అర్థం చేసుకునే మ‌న‌సు ఎవ‌రికి లేదా?

By:  Tupaki Desk   |   8 March 2017 10:40 AM GMT
కేఈని అర్థం చేసుకునే మ‌న‌సు ఎవ‌రికి లేదా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి ఒక్క‌రోజులోనే ప్లేట్ పిరాయించేశారు. నిన్న‌టికి నిన్న ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబుపై తీవ్ర‌ అసంతృప్తి వ్య‌క్తం చేసిన కేఈ తెల్ల‌వారే స‌రికి మాటమార్చేశారు. త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని చెప్పారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అంటే త‌న‌కెంతో గౌర‌వ‌మ‌ని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నా తన‌కు-త‌న సోద‌రుడికి అపార‌మైన‌ గౌరవం ఉందని పేర్కొన్నారు. త‌మ‌పై చెడ్డ ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని కూడా కేఈ కోరారు.

మంగ‌ళ‌వారం కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ఎన్నిక‌ల్లో త‌మ కుటుంబానికి అన్యాయం జ‌రుగుతోందని, త‌న త‌మ్ముడికి ప్రాధాన్యం క‌ల్పించ‌క‌పోవ‌డం వ‌ల్ల తాను నిద్ర‌లేని రాత్రులు గ‌డ‌పాల్సి వ‌స్తోంద‌ని వాపోయారు. అంతేకాదు టీడీపీలో బీసీల‌కు అన్యాయం జ‌రుగుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌నే మాట కూడా చెప్పేశారు. కాగా ఈ రోజు కేఈ కృష్ణ‌మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై తాను అసంతృప్తితో ఉన్నట్లుగా వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని తెలిపారు. తాను ముఖ్య‌మంత్రి సార‌థ్యంలోనే ప‌నిచేస్తున్నాన‌ని వివ‌రించారు. ఆంధ్రప్ర‌దేశ్ అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శ‌త‌విధాల క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పారు. ఆయ‌న మాటే తాము అనుస‌రిస్తున్న‌ట్లు సెల‌విచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/