Begin typing your search above and press return to search.

హిజాబ్ ర‌చ్చ‌.. సంచ‌ల‌న కామెంట్లు చేసిన క‌ర్ణాట‌క స్వామీజి

By:  Tupaki Desk   |   14 Feb 2022 3:30 PM GMT
హిజాబ్ ర‌చ్చ‌.. సంచ‌ల‌న కామెంట్లు చేసిన క‌ర్ణాట‌క స్వామీజి
X
క‌ర్ణాట‌క‌లోని విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్‌ ధరించడం చిలికి చిలికి గాలివాన‌గా మారిన సంగ‌తి తెలిసిందే. జాతీయ స్థాయిలోనే కాకుండా అంత‌ర్జాతీయంగా కూడా ఈ వివాదంపై ఆయా దేశాలు స్పందిస్తున్నాయి. అయితే, కర్ణాటకలోని రామకృష్ణ ఆశ్రమానికి చెందిన యోగి భవేశానంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

హిజాబ్‌ వివాదం సమాజానికి మంచిది కాదని, ఈ విష‌యంలో అనవసర చర్చ జరుగుతోందని అన్నా రు. హిజాబ్‌పై ప్రస్తుతం జరుగుతున్న చర్చ, రాద్ధాంతాన్ని చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోందని వెల్లడించారు.

ఇక ఓ న్యాయ‌వాదికి హిజాబ్ విష‌యంలో ఎదురైన స‌మ‌స్య‌ల‌పై సైతం భ‌వేశానంద్ స్పందించారు. హిజాబ్‌ ధరించడం తమ హక్కు అని, విద్యా సంస్థల్లో కూడా అనుమతించాలని కోరుతూ ముస్లిం యువతులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. వారి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దేవాదత్‌ కామత్‌ను కొందరు టార్గెట్‌ చేసుకున్నారని విమర్శించారు.

దేవాదత్‌ ఓ న్యాయవాది అని, తన క్ల‌యింట్‌కు న్యాయం జరిగేలా చూడటం ఆయన విధి అని భవేశానంద్‌ చెప్పారు. ఆయన హిందూ వ్యతిరేకి అన్నట్టు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయడం తగదని సూచించారు. ఈ వివాదంలోకి ఓ న్యాయవాదిని కూడా లాగడం చూస్తుంటే బాధేస్తున్నదని వెల్లడించారు.

ఇదిలాఉండ‌గా, హిజాబ్‌ వివాదం మధ్యప్రదేశ్‌ను సైతం తాకింది. మధ్యప్రదేశ్‌లోని ఓ కాలేజీకి పీజీ విద్యార్థిని రుక్సానాఖాన్‌ హిజాబ్‌ ధరించి రావడంపై ప్రిన్సిపల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ హిజాబ్‌ ధరించి కాలేజీకి రాబోనంటూ లేఖ రాయించుకున్నారు.