Begin typing your search above and press return to search.

వైఎస్ జ‌గ‌న్ ను క‌లిసిన క‌ర్ణాట‌క మంత్రి శ్రీరాములు

By:  Tupaki Desk   |   15 Feb 2020 9:07 AM GMT
వైఎస్ జ‌గ‌న్ ను క‌లిసిన క‌ర్ణాట‌క మంత్రి శ్రీరాములు
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తో క‌ర్ణాట‌క మంత్రి శ్రీరాములు స‌మావేశం అయ్యారు. జ‌గన్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ముందు శ్రీరాములు స‌తీస‌మేతంగా ఏపీ సీఎంతో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో వైఎస్ భార‌తి కూడా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌మావేశంలో రాజ‌కీయం ఏమీ లేదు. కేవ‌లం వ్య‌క్తిగ‌త స‌మావేశ‌మే అని చెప్ప‌వ‌చ్చు.

త‌న కూతురు వివాహానికి ఏపీ ముఖ్య‌మంత్రిని ఆహ్వానించారు శ్రీరాములు. స‌తీస‌మేతంగా అమ‌రావ‌తి వ‌చ్చి జ‌గ‌న్ ను ఆ వివాహానికి ఆహ్వానించారు క‌ర్ణాట‌క మంత్రి. ఇటీవ‌లే ఏర్ప‌డిన య‌డియూర‌ప్ప స‌ర్కారులో వైద్య‌శాఖా మంత్రిగా ఉన్నారు శ్రీరాములు. ఈయ‌న‌తో వైఎస్ జ‌గ‌న్ కు ముందు నుంచినే స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నేది తెలిసిన సంగ‌తే.

క‌ర్ణాట‌క మైనింగ్ టైకూన్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి స‌న్నిహితుడు శ్రీరాములు. ఆ సాన్నిహిత్యంతో ముందు నుంచినే వైఎస్ కుటుంబంతో శ్రీరాముల‌కు స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగుతూ ఉన్నాయి. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ లో ఉన్న‌ప్పటి నుంచినే బీజేపీలో గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి, శ్రీరాములు త‌దిత‌రులు యాక్టివ్ గా ఉన్నారు. పార్టీలు వేరైనా వారు స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తూ ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న జ‌గ‌న్ కు క‌ర్ణాట‌క‌ మంత్రి హోదాలో ఉన్న శ్రీరాములు త‌న కూతురు వివాహానికి ఆహ్వానం అందించారు.