Begin typing your search above and press return to search.

జగన్ కు ట్వట్టర్ లో 'కన్న' మేశాడు

By:  Tupaki Desk   |   29 Oct 2019 8:13 AM GMT
జగన్ కు ట్వట్టర్ లో  కన్న మేశాడు
X
ప్రధాని నరేంద్రమోడీ బాటలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నడుస్తున్నాడు. ఇక విలేకరుల సమావేశాలు.. వివిధ కార్యక్రమాల్లో మాట్లాడడం తగ్గించేసి ట్విట్టర్ గూట్లో చెడుగుడు ఆడేస్తున్నాడు.

తాజాగా జగన్ సర్కార్ పై ట్విట్టర్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ‘జగన్ కు 151 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృత్రిమ కొరత సృష్టించి రూ.150 కూలి కూడా రాని పరిస్థితికి భవన నిర్మాణ కార్మికులను తీసుకొచ్చాడు’ అని కన్నా ధ్వజమెత్తాడు. ఇంతటి అసమర్థ సర్కారును తాను ఇంతవరకూ చూడలేదని మండిపడ్డాడు.

ఇక రంగులేసుకోవడానికి తప్ప ఆర్భాటానికి తప్ప పాలించడానికి పనికిరాని పార్టీ వైసీపీ అని కన్నా కడిగేశాడు. ఈ సందర్భంగా వైసీపీ రంగులు వేసిన పంచాయతీ - పాఠశాల భవనాలు - నీళ్లట్యాంకు - బోరు - స్వాగత ద్వారం ఫొటోలను ట్యాగ్ చేసి ఎండగట్టాడు.

జగన్ ప్రకటిస్తున్న వరాలకు - రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎంత మాత్రం పొంతన కుదరడం లేదని కన్నా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆచరణలో అమలయ్యే హామీలివ్వాలని సూచించారు.