Begin typing your search above and press return to search.

క్రికెటర్ల మధ్య చిచ్చుపెట్టిన కరోనా ..ఏమైందంటే !

By:  Tupaki Desk   |   7 March 2020 12:30 PM GMT
క్రికెటర్ల మధ్య చిచ్చుపెట్టిన కరోనా ..ఏమైందంటే !
X
కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ పేరుని వింటేనే ఆమడ దూరం లో ఆగిపోతున్నాయి. చైనాలోని వూహన్ సిటీలో పుట్టిన ఈ మహమ్మారి .. ప్రస్తుతం ప్రపంచంలోని 92 దేశాలకి విస్తరించి ,అందరికి కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ కరోనా దెబ్బకి కుదేలవ్వని రంగం అంటూ లేదు. ప్రపంచంలోని అన్ని సంస్థలు ఈ కరోనా చేతికి చిక్కి భారీ నష్టాలని చవిచూస్తున్నాయి. ఇక ఈ కరోనా వైరస్ క్రికెటర్ల మధ్య గొడవకు కూడా కారణం అయింది.

అయితే అసలు విషయం ఏమిటంటే .. ఈ నెల 19 నుండి శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ శ్రీలంక పర్యటనకు రానుంది. అయితే కరోనా కారణంగా మ్యాచ్ లో మేము వేరే జట్టు ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వం అని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ వెల్లడించారు. ఇంగ్లాండ్ చివరగా వెళ్లిన దక్షిణాప్రికా పర్యటనలో వాళ్ళ ఆటగాళ్లకు వాంతులు, ఫ్లూ జ్వరం రావడంతో మేము ఇక నుండి ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ కాకుండా ఫస్ట్‌బంప్‌ తో విష్‌ చేస్తామని ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ చెప్పాడు.

అయితే ఈ విషయం పై ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌ కొంచెం వ్యంగ్యంగా స్పందించాడు. జాన్సన్‌ తన ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీస్‌ లో ఇంగ్లాండ్‌ జట్టుతో పాటు ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ను ఉదేశిస్తూ ఓ పోస్ట్ చేసాడు. 2017లో స్టోక్స్‌ ఇద్దరిపై గొడవపడి అరెస్ట్ అయిన విషయాన్ని మరోసారి అందరికి గుర్తు చేస్తూ... శ్రీలంక ఆటగాళ్లకు మీరు ఇంగ్లాడ్ ఆటగాళ్ల తో ఫస్ట్‌ బంప్‌ చేయవచ్చు కానీ స్టోక్స్‌ తో కొంచెం జాగ్రత్త అతను చాల గట్టి ఫస్ట్‌ బంప్‌ ఇస్తాడు అని పోస్ట్ చేసాడు. యితే ఈ విషయం పై స్పందించిన స్టోక్స్‌ జాన్సన్‌ కు కోపం వచ్చేలా 2010-11 యాషెస్‌ సిరీస్ లో అతని ఉదేశిస్తూ పాడిన పాట లిరిక్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. చూడాలి దీనిపై జాన్సన్‌ ఏవిధంగా స్పందిస్తాడో..