Begin typing your search above and press return to search.

జేసీ దివాకర్ కు చుక్కులు చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   18 Oct 2019 10:37 AM GMT
జేసీ దివాకర్ కు చుక్కులు చూపిస్తున్నారు
X
అనంతపురం జిల్లాకు చెందిన జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన వ్యాపారాల్లో ఒకటి 'దివాకర్ ట్రావెల్స్'. ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నన్నీ నాళ్లు అడిగే నాథుడే లేకుండా రెచ్చిపోయాడన్న విమర్శలున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీఏ ఆఫీసులోకి వెళ్లి మరీ తన బస్సులను సీజ్ చేస్తావా అంటూ అధికారులపై జేసీ సోదరులు చేసిన హంగామా అందరికీ తెలిసిందే.. నాడు చంద్రబాబు బ్యాక్ బోన్ గా ఉండడంతో ఈయన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది.. దివాకర్ బస్సులు అక్రమంగా పర్మిట్ లేకుండా నడిచినా.. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసినా.. ప్రమాదాలు జరిపినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు..

కానీ ఇప్పుడు వైసీపీ సర్కారు వచ్చాక రోడ్డు సేఫ్టీపై కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ జేసీ రెడ్డప్ప బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝలిపిస్తున్నారు. ఇప్పటికే ఇరవై మూడు జేసీ దివాకర్ రెడ్డి 'దివాకర్ ట్రావెల్స్' బస్సులను అక్రమంగా తిప్పుతున్నారని సీజ్ చేశారు. తాజాగా మరో ఎనిమిది బస్సులను పర్మిట్లు లేకుండా అక్రమంగా నడుపుతున్నందుకు రవాణాశాఖ అధికారులు కొరఢా ఝలిపించారు.

బోలెడన్నీ లొసుగులు కలిగి కనీస అనుమతులు తీసుకోకుండా రోడ్డెక్కి ప్రయాణికులను దోపిడీ చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్న దివాకర్ బస్సులకు ఎట్టకేలకు చెక్ పడిందన్న వాదన ప్రయాణికుల నుంచి వెలువడుతోంది. ఇన్నాల్లు అధికార అండతో చెలరేగిపోయిన దివాకర్ రెడ్డికి ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. పవర్ లేకుంటే ఎలా ఉంటుందో.. అక్రమాలకు పాల్పడితే ఎంతటి నష్టాలు జరుగుతాయో తెలిసి వచ్చిందంటున్నారు. దివాకర్ ట్రావెల్స్ దందాకు చెక్ పడిందని ఆయన బాధితులు చెబుతున్నారు.