Begin typing your search above and press return to search.

మంత్రి ఎర్రబెల్లి పై జగ్గా రెడ్డి తీవ్ర ఆగ్రహం

By:  Tupaki Desk   |   2 Jan 2020 10:47 AM GMT
మంత్రి ఎర్రబెల్లి పై జగ్గా రెడ్డి తీవ్ర ఆగ్రహం
X
‘కేటీఆర్ ను పొగుడుకో.. భజన చేసుకో.. తప్పులేదు.. కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరీ చెయ్యకు’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి. గురువారం గాంధీ భవన్లో మాట్లాడిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి మంత్రి ఎర్రబెల్లి చేసిన విమర్శలు సరికాదని దుయ్యబట్టారు. అసలు రాహుల్ గాంధీ స్థాయికి , కేటీఆర్ స్థాయి కి పోలిక ఉందా అని ప్రశ్నించారు.ప్రధాని పదవిని త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని.. కేటీఆర్ ను ఆయనతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు.

ప్రతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లకు కనీసం వారం, పది రోజులు వ్యవధి ఉండాలని.. ఎన్నికల అధికారి నాగిరెడ్డి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాడని విమర్శించారు.

డబ్బు, పోలీస్, ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ విరివి గా వాడుతున్నారని మండిపడ్డారు. ఐఏఎస్ లు అధికార పార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని వివరించారు.