Begin typing your search above and press return to search.

ఆన్లైన్ రమ్మీ ఆడినట్టు తెలిస్తే .... బొక్కలు ఇరిగిపోతాయ్!

By:  Tupaki Desk   |   1 Dec 2020 11:05 AM GMT
ఆన్లైన్ రమ్మీ ఆడినట్టు తెలిస్తే .... బొక్కలు ఇరిగిపోతాయ్!
X
ఆన్ లైన్ రమ్మీ ... ప్రస్తుతం ఈ ఆన్లైన్ రమ్మీకి చాలామంది అడిక్ట్ అయిపోయారు. పొద్దున్న లేచినప్పటి నుండి మళ్లీ రాత్రి పడుకునే వరకు ఆన్ లైన్ రమ్మీ లో మునిగితేలేవారెందరో. అయితే , ఈ ఆన్ లైన్ రమ్మీకి బాగా అడిక్ట్ అయ్యి .. డబ్బులు పోగొట్టుకొని సంసారాలని రోడ్డున పడేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు ఏపీలో ఎక్కువ అవుతుండటం తో , ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆన్ లైన్ జూదం నియంత్రణ బిల్లు పై జరిపిన చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్‌ ఆరోపణలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆన్‌ లైన్‌ జూదానికి సంబంధించి ఎక్కడైనా, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. అలాగే, కర్నూలు జిల్లాలో మంత్రి జయరామ్‌ దూరపు బంధువు ఒకరు గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారని , ఆ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి బంధువు అని చెప్పి వదిలిపెట్టలేదని , ఆ తర్వాత స్వయంగా మంత్రి జయరామ్‌ కూడా ఆ ఘటన పై స్పందించారని ,రాష్ట్రంలో ఎవరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. మా ప్రభుత్వం ఆ విధంగా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను.

తప్పు ఎవరు చేసినా తప్పే.. ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సీఎం చెప్పారు. ఈ ఆన్ లైన్ జూదం పై పోలీసులకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎక్కడా, ఎవరినీ వదిలిపెట్టడమనేది ఉండదు.. కచ్చితంగా చర్య తీసుకుంటాం అని , దీనిలో భాగంగానే ఆన్‌లైన్‌ జూదంకు కళ్లేం వేయాలనే అంశంతో నేడు జూదాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు రావడం జరిగిందని అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆన్ ‌లైన్‌ జూదానికి పిల్లలు అలవాటు కావొద్దనే వారి భవిష్యత్తు చెడిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. ఐదేళ్లలో ఆన్‌లైన్‌ జూదాన్ని నియంత్రించడానికి కనీసం చట్టం కూడా ఎందుకు తీసుకు రాలేదని జగన్‌ ప్రశ్నించారు. ఇప్పుడు దానిపై ఓ కీలక నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి.. రాజకీయంతో దాన్ని ట్విస్ట్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు.