Begin typing your search above and press return to search.

గుడ్ల పందెం అంటే మాములా 50 తింటా అని 42కే

By:  Tupaki Desk   |   4 Nov 2019 7:47 AM GMT
గుడ్ల పందెం అంటే మాములా  50 తింటా అని 42కే
X
సాధరణంగా నలుగురు స్నేహితులు కానీ , ఒకే ఊరు వారు కానీ ఒక చోట చేరితే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఒకరిమీద ఒకరు సెటైర్లు వేసుకుంటు చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే నలుగురు కలిసి ఉన్న సమయంలో దేనిపైనా పందెం వేసుకోవడం కూడా మాములే. కానీ , కొన్ని సార్లు అవే బెట్టింగ్స్ వారి ప్రాణాల మీదకి కూడా తెస్తుంటాయి. బెట్టింగ్స్ ద్వారా వచ్చే డబ్బు కోసం ప్రాణాలతోనే చెలగాటం ఆడుతుంటారు కొంతమంది. కానీ , ప్రాణాలకంటే ఏది ముఖ్యం కాదు అని వారు తెలుసుకోలేక పోతున్నారు. తాజాగా అలాంటి సాధారణ ఒక బెట్టింగ్ నిండు ప్రాణాన్ని బలిగొంది.

యూపీలోని జౌన్‌పూర్‌లో కొంతమంది సరదాగా ఓకే బెట్టింగ్ వేసుకున్నారు. అదేమిటంటే 50 గుడ్లు, ఒక బాటిల్ మద్యం తాగాలని, ఇలాచేస్తే గెలిచినవారికి రూ. 2000 బహుమతిగా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. 50 గుడ్లు తింటే రూ. 2000 ఇస్తామన్న బెట్టింగ్‌‌కు ఒక వ్యక్తి సిద్ధపడ్డాడు. అయితే 42వ గుడ్డు తినగానే స్పృహ తప్పి కిందపడిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జైన్‌పూర్‌లోని బీబీగంజ్ బజార్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. సుభాష్ తన స్నేహితునితో గుడ్లు తినడంపై పందెం కాశాడు. ఎవరు ఎన్ని గుడ్లు తింటారనే దానిపై చర్చ జరిగింది. 50 గుడ్లు, ఒక బాటిల్ మద్యం తాగాలని, ఇలాచేస్తే గెలిచినవారికి రూ. 2000 బహుమతిగా ఇవ్వాలని వారు అనుకున్నారు. దీనికి సుభాష్ అంగీకరిస్తూ, గుడ్లు తినడం ప్రారంభించాడు. 41 గుడ్లను తినేశాడు అప్పటివరకు ఎటువంటి సమస్య లేదు. కానీ , 42వ గుడ్డును తింటుండగా స్పృహతప్పి కింద పడిపోయాడు. దీనితో వెంటనే అక్కడున్న వారు అతనిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుని ఆరోగ్యం విషమించడంతో అక్కడి వైద్యులు లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ సుభాష్ మృతి చెందాడు. ఇకపోతే సుభాష్ ఇటీవలే ద్వితీయ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురూ అమ్మాయిలే కావడంతో అబ్బాయి కోసం రెండవ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సుభాష్ రెండవ భార్య గర్భంతో ఉంది.