Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌లకు పండ‌గే.. ఎందుకంటే..!

By:  Tupaki Desk   |   28 Aug 2021 10:39 AM GMT
వైసీపీ నేత‌లకు పండ‌గే.. ఎందుకంటే..!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కీల‌క నేత‌లందరూ హ‌ర్షాతిరేకాల్లో మునిగిపో యారు. మ‌రికొంద‌రు కేకులు క‌ట్ చేసి.. పార్టీలు చేసుకున్నారు. మ‌రి ఇంత‌కీ దీనికి రీజ‌నేంటి? హ‌ఠాత్తుగా ఎందుకు పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొందంటే.. ఈ రోజు పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, భార‌తి దంప తుల 25వ వార్షిక మ‌హోత్సవం. ఈ దినోత్స‌వాన్ని ప్ర‌తి ఒక్క వైసీపీ నాయ‌కుడు కూడా సొంత ప‌డ‌గ‌గా భావించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కొంద‌రు జ‌గ‌న్ అభిమానులు అయితే.. మ‌రిన్ని అడుగులు ముందుకేశారు.

జ‌గ‌న్‌.. భార‌తి దంప‌తుల భారీ క‌టౌట్లు ఏర్పాటు చేసి.. పూల‌దండ‌ల‌తో అలంక‌రించారు. వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యే లతో పాటు పలువురు నాయకులు జగన్‌ దంపుతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక‌, పార్టీలో ఎప్పుడూ వెరైటీగా క‌నిపించే శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధు సూదన్‌ రెడ్డి ఈ భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేశారు. జగన్‌- భారతిల ఫోటోలతో దీన్ని రూపొందించారు. సీఎం జగన్‌ దంపతలకు విషెస్‌ చెబుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా… 25 వ వివాహ వార్షికోత్సవం నేపథ్యం లో జగన్‌ ఫ్యామిలీ… సిమ్లా టూర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే, జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. `` ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌- వైఎస్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ దంపతులకు జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్న``ట్లు ట్వీట్‌ ద్వారా తెలియజేశారు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్.