Begin typing your search above and press return to search.

ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు, పదోన్నతులు

By:  Tupaki Desk   |   6 March 2020 2:36 PM IST
ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు, పదోన్నతులు
X
ఏపీలో పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేపట్టింది. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా హరీష్ కుమార్ గుప్తా, మెరైన్ పోలీస్ చీఫ్ గా ఎఎస్ ఖాన్ , ఆర్కే మీనాకు అదనపు డీజీగా పదోన్నతి కల్పించింది.

ఇక గుంటూరు రేంజ్ ఐజీగా జే ప్రభాకర్ రావు, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా వినీత్ బ్రిజ్ లాల్, డీజీపీ కార్యాలయంలో లీగల్ ఐజీగా నాగేంద్ర కుమార్ ను బదిలీ చేసింది.

వీరే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్ కుమార్, ఏసీబీ ఐజీగా అశోక్ కుమార్, ఏలూరు రేంజ్ డీఐజీగా కేవి మోహన్ రావు, నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్ సునీల్, ఏపీఎస్సీ కాకినాడ కమాండెంట్ గా అమిత్ బర్దార్, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి, ఎస్ఐబీ చీఫ్ గా శ్రీకాంత్, ఐజీ లీగల్ గా పి.హరికుమార్, సీఐడీ డీఐజీగా హరికృష్ణ, ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా ఎస్వీ రాజశేఖర్ బాబులను జగన్ ప్రభుత్వం నియమించింది.