Begin typing your search above and press return to search.

వివాదాస్ప‌ద స్వామికి ఇందిరాగాంధీ న‌చ్చింది​

By:  Tupaki Desk   |   20 April 2016 5:04 PM GMT
వివాదాస్ప‌ద స్వామికి ఇందిరాగాంధీ న‌చ్చింది​
X

వివాదాస్పద వ్యాఖ్యలకు పేరొందిన ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌ల శని సింగ్నాపూర్‌ ఆలయంలోకి మహిళలు ప్రవేశించినప్పుడు, మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ఈ చర్య మరింత దోహదం చేస్తుందంటూ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళా వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డిన స్వరూపానంద తాజాగా ఐర‌న్ లేడీని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్వ‌రూపానంద‌ పొగడ్తలతో ముంచెత్తారు. ఇందిరాగాంధీ ఒక పార్శీతో ప్రేమలో పడి అతడినే వివాహమాడినా, వారి మతంలోకి మారలేదని స్వరూపానంద అన్నారు. ఆ విధంగా హిందూమ‌తంపై ఇందిరా త‌న మ‌మ‌కారం చాటుకున్నార‌ని చెప్పారు. ఇందిరా ఎప్పుడూ దేవతలను, దేవుళ్లను ప్రార్థించేవారని స్వరూపానంద ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. మ‌హిళ‌ల‌పై వివాదాస్పద వ్యాఖ్య‌లు చేయ‌డంలో ముందుండే స్వరూపానంద‌కు హ‌ఠాత్తుగా ఇందిరా ఎందుకు గుర్తుకువ‌చ్చిందో అంటూ ఇటు సంప్ర‌దాయ‌వాదులు, అటు కాంగ్రెస్ వాదులు చ‌ర్చించుకుంటున్నారు.