Begin typing your search above and press return to search.

అమెరికాలో కాల్పులు..తెనాలి కుర్రాడు దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   7 Sep 2018 6:33 AM GMT
అమెరికాలో కాల్పులు..తెనాలి కుర్రాడు దుర్మ‌ర‌ణం
X
గ‌న్ క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆగ్ర‌రాజ్య‌మైన అమెరికాలో మ‌రోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల‌కు కార‌ణం స‌రిగా తెలీకున్నా.. సిన్సినాటిలోని ఒక బ్యాంకును దోచుకున్నందుకు ప్ర‌య‌త్నించిన గుర్తు తెలియ‌ని దొంగ‌లు జ‌రిపిన కాల్పుల్లో తెలుగు కుర్రాడు మ‌ర‌ణించాడు.

గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట‌కు చెందిన పృథ్వీరాజ్ (26) అమెరికాలో ఉంటున్నాడు. తాజాగా బ్యాంకు వెళ్లిన అత‌గాడు.. బ్యాంకును దోచుకునేందుకు వ‌చ్చిన దుండ‌గులు కాల్పుల‌కు తెగబ‌డ్డారు. ఈ కాల్పుల్లో తెనాలి కుర్రాడు దుర్మ‌ర‌ణం పాలైన‌ట్లుగా తెలిసింది.

చేతికి అంది వ‌చ్చిన కొడుకు కాల్పుల్లో మ‌ర‌ణించ‌టంతో పృథ్వీరాజ్ కుటుంబ స‌భ్యులు తీవ్రంగా విల‌పిస్తున్నారు. క‌న్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పృథ్వీ రాజ్ భౌతిక‌కాయాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు అక్క‌డి తెలుగు సంఘాలు.. అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.