Begin typing your search above and press return to search.
గెట్ రెడీ... అండర్ వాటర్ మెట్రో వచ్చేస్తోంది!
By: Tupaki Desk | 8 Aug 2019 10:43 PM ISTనానాటికీ అప్ డేట్ అవుతున్న టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు కొత్త కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరహా సౌకర్యాల్లో ఇప్పుడు దేశంలో ఓ సరికొత్త రవాణా సౌకర్యం మనకు అందుబాటులోకి వచ్చేస్తోంది. అదే నీటి లోపల అది కూడా రైల్లో కూర్చుని మరీ ప్రయాణించే సరికొత్త అనుభూతి మనల్ని పలకరించనుంది. భారత రైల్వే త్వరలోనే అండర్ వాటర్ మెట్రో జర్నీని ప్రారంభించనుందట. ఆసక్తి రేకెత్తించే ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటుగా సదరు అండర్ వాటర్ మెట్రో జర్నీ ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలిపేందుకు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ విశేషాలేమిటో చూద్దాం పదండి.
దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ఏర్పాటు దాదాపుగా పూర్తి అయ్యింది. కోల్ కతాలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోయల్ గురువారం ప్రకటించారు. కోల్ కతా హుగ్లీ నది కింద భారతీయ తొలి అండర్ వాటర్ ట్రైన్ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘అద్భుతమైన ఇంజనీరింగ్ కు ఇదొక ఉదాహరణ. దేశంలో రైల్వే పురోగతికి చిహ్నం. ఈ సర్వీసుతో కోల్ కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. ఇది దేశం గర్వపడే విషయం’ అని ఆయన ఈ సరికొత్త జర్నీని వివరించారు.
ఇక ఈ ఈ సర్వీస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడుస్తుందన్న విషయానికి వస్తే... కోల్ కతా మెట్రో లైన్-2.. అంటే ఈస్ట్-వెస్ట్ మెట్రో కిందకు వస్తుంది. 16 కి.మీ లైన్ వరకూ వేయనున్న ఈ ట్రాక్ పనులు రెండు దశలుగా జరుగుతాయి. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్ ను సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్ తో కలుపుతూ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి దశ ఉంటుంది. దీన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఆ కొత్త మెట్రో మార్గం ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందట. ఈ మెట్రో సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017లో చివరలో ప్రారంభం కాగా 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలు ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి రచ్నా - ప్రేర్నా అనే రెండు టాప్-ఆర్డర్ టన్నెల్ బోరింగ్ యంత్రాలను తెప్పించారు. అలాగే నీరు లీకేజీని నివారించడానికి నాలుగు రక్షణ కవర్లు కూడా ఉన్నాయి.
దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ఏర్పాటు దాదాపుగా పూర్తి అయ్యింది. కోల్ కతాలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోయల్ గురువారం ప్రకటించారు. కోల్ కతా హుగ్లీ నది కింద భారతీయ తొలి అండర్ వాటర్ ట్రైన్ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘అద్భుతమైన ఇంజనీరింగ్ కు ఇదొక ఉదాహరణ. దేశంలో రైల్వే పురోగతికి చిహ్నం. ఈ సర్వీసుతో కోల్ కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. ఇది దేశం గర్వపడే విషయం’ అని ఆయన ఈ సరికొత్త జర్నీని వివరించారు.
ఇక ఈ ఈ సర్వీస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడుస్తుందన్న విషయానికి వస్తే... కోల్ కతా మెట్రో లైన్-2.. అంటే ఈస్ట్-వెస్ట్ మెట్రో కిందకు వస్తుంది. 16 కి.మీ లైన్ వరకూ వేయనున్న ఈ ట్రాక్ పనులు రెండు దశలుగా జరుగుతాయి. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్ ను సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్ తో కలుపుతూ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి దశ ఉంటుంది. దీన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఆ కొత్త మెట్రో మార్గం ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందట. ఈ మెట్రో సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017లో చివరలో ప్రారంభం కాగా 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలు ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి రచ్నా - ప్రేర్నా అనే రెండు టాప్-ఆర్డర్ టన్నెల్ బోరింగ్ యంత్రాలను తెప్పించారు. అలాగే నీరు లీకేజీని నివారించడానికి నాలుగు రక్షణ కవర్లు కూడా ఉన్నాయి.
