Begin typing your search above and press return to search.
బెజవాడలో నోట్లకట్టలు.. హవాలా సొమ్మేనా?
By: Tupaki Desk | 30 Nov 2020 1:40 PM ISTఏపీలోని విజయవాడలో భారీగా నోట్లకట్టలను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు రూ. కోటి నగదును తీసుకెళ్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నోట్లకట్టలు ఎవరు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. అనే విషయంపై మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇటీవల ఏపీలోని పలుచోట్ల నోట్లకట్టలు బయటపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేయగా ఇద్దరు వ్యక్తుల వద్ద రూ. కోటి నగదు పట్టుబడింది. అయితే సరైన పత్రాలు చూపించక పోవడంతో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వీళ్లిద్దరూ ఒకే ముఠాకు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు కు చెందిన హవాలా వ్యాపారులు ఈ దందాను సాగిస్తున్నట్టు సమాచారం. విజయవాడనుంచి హవాలా మార్గంలో అనంతపురం జిల్లా గుంతకల్లుకు డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హవాలా దందాలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు గుంతకల్లుకు చెందిన వ్యాపారులదని సమాచారం.
విజయవాడలోని ఎవరివద్ద నుంచి ఈ డబ్బు తీసుకెళ్లారు..అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. విచారణ అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉన్నది. హవాలా మూలాలపై టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఏపీలోని పలుచోట్ల హవాలా డబ్బు బయటపడింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు కు చెందిన హవాలా వ్యాపారులు ఈ దందాను సాగిస్తున్నట్టు సమాచారం. విజయవాడనుంచి హవాలా మార్గంలో అనంతపురం జిల్లా గుంతకల్లుకు డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హవాలా దందాలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు గుంతకల్లుకు చెందిన వ్యాపారులదని సమాచారం.
విజయవాడలోని ఎవరివద్ద నుంచి ఈ డబ్బు తీసుకెళ్లారు..అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. విచారణ అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉన్నది. హవాలా మూలాలపై టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఏపీలోని పలుచోట్ల హవాలా డబ్బు బయటపడింది.
