Begin typing your search above and press return to search.

ఆ బిల్లు పార్లమెంట్ కి వస్తే .. అరగంటలో దేశం అంధకారం

By:  Tupaki Desk   |   11 March 2021 9:15 AM GMT
ఆ బిల్లు పార్లమెంట్ కి వస్తే ..  అరగంటలో దేశం అంధకారం
X
గత కొన్ని రోజులుగా కేంద్రం తీసుకునే పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తీసుకొచ్చిన కేంద్రం పై రైతులు గత కొన్ని రోజులుగా గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తునట్టు ప్రకటించింది. అలాగే దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నా కూడా పట్టించుకోవడంలో , అలాగే పెట్రోల్ ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. వాటి గురించి పట్టించుకోవడంలో కానీ తాజాగా కేంద్రం కన్ను విద్యుత్ శాఖ పై పడింది. విద్యుత్‌ సవరణ బిల్లు-2021 ను లోక్ సభ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే , ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే .. అర్ధగంట లోపే దేశం మొత్తం అంధకారం లోకి వెళ్ళిపోతుంది అని విద్యుత్ ‌ ఉద్యోగులందరూ చెప్తున్నారు.

లోక్‌సభ వెబ్ ‌సైట్‌ లో బిల్లును లిస్టింగ్‌ చేసిందని, బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారో మూడు రోజుల ముందు వరకు కూడా తెలియనుందన్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా బిల్లును తెస్తే అర్ధగంటలో యావత్‌ దేశం అంధకారమవుతుందని హెచ్చరించారు. ఈ బిల్లును పార్లమెంట్‌ లో ప్రవేశపెడితే, విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు విద్యుత్‌ ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగుతారని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు హెచ్చరించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి విద్యుదుత్పత్తి కేంద్రాలు, లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు వంటి అత్యవసర విభాగాల ఉద్యోగులందరూ సమ్మెకు దిగుతారని చెప్పారు.

లైసెన్స్‌ లేకుండా విద్యుత్‌ పంపిణీ రంగంలో వ్యాపారం చేసేందుకు ప్రైవేటు వ్యాపారులకు అవకాశం కల్పించడానికి ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. వినియోగదారులు, విద్యుత్‌ ఉద్యోగులతోపాటు విద్యుత్‌ సంస్థలకు ఈ బిల్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న రాయితీలు ఇక ముందు లభించవని, ప్రైవేటు కంపెనీలు మాఫియాగా ఏర్పడి విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచేస్తాయన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, వ్యవసాయ పంప్‌సెట్లకు సైతం మీటర్లు బిగించనున్నారని పేర్కొన్నారు.

ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని అన్నారు. విద్యుత్‌ బిల్లును వ్యతిరేకించే పార్టీలకే విద్యుత్‌ ఉద్యోగుల మద్దతు ఉంటుందని రత్నాకర్ ‌రావు తెలిపారు. విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో సీఎం కేసీఆర్‌ తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని విద్యుత్‌ ఉద్యోగులను కోరారు. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు.