Begin typing your search above and press return to search.
సెలవు తీసుకోకుండా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ !
By: Tupaki Desk | 14 Sept 2020 6:30 PM ISTపెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అతి ముఖ్యమైన , అతి పెద్ద పండుగ. పెళ్లి పై ప్రతి ఒక్కరూ చాలా ఆశలు పెట్టుకుంటుంటారు. బంధువులని , సన్నిహితులని , మిత్రులని పిలుచుకొని అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంటారు. కానీ , కరోనా నేపథ్యంలో పెళ్లి పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో కరోనా విధుల్లో బిజీగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కనీసం తన పెళ్లికి కూడా సెలవు తీసుకోలేదు. వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణనే ఆమెకి ఎక్కువగా భావించారు. అందుకే, ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన తన వివాహానికి కూడా సెలవు తీసుకోలేదు. దీంతో వరుడే వచ్చి పెళ్లి చేసుకున్నాడు.
అస్సాంలో జరిగిన ఈ ఘటనలో వధువుది హైదరాబాద్ కాగా,పెళ్ళికొడుకు పుణేకి చెందిన వ్యక్తి. హైదరాబాద్ కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్ తో వివాహం కుదిరింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న చచర్ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో విధులను పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లడం ఆమె ఇష్టపడలేదు.
ఆ నిర్ణయాన్ని వరుడు, అతని కుటుంబం కూడా ఆమె నిర్ణయానికి మద్దతు తెలిపాడు. దీనితో వరుడు తన బంధువులతో కలిసి పెళ్లికి ముందే సిల్చార్ వెళ్లాడు. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడ క్వారంటైన్ లో ఉండి పెళ్లి జరిపారు. కీర్తి అధికారిక బంగ్లాలో బుధవారం ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కేవలం కర్ణాటక సంగీతం వినిపిస్తుండగా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్ వీడియో యాప్ ద్వారా 800 మంది చూశారు. హైదరాబాద్లో ఉన్న మా అమ్మానాన్నలకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో నా సోదరి మాత్రమే పెళ్లికి హాజరైంది అని కీర్తి తెలిపారు. మంగళ, గురువారాల్లో కూడా కీర్తి అధికారిగా తన విధుల్లో పాల్గొన్నారు. ఇక పెళ్లి రోజైన బుధవారం కూడా ఫోన్ ద్వారా అధికారులకి తగిన సలహాలు ఇచ్చారు.
అస్సాంలో జరిగిన ఈ ఘటనలో వధువుది హైదరాబాద్ కాగా,పెళ్ళికొడుకు పుణేకి చెందిన వ్యక్తి. హైదరాబాద్ కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్ తో వివాహం కుదిరింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న చచర్ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో విధులను పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లడం ఆమె ఇష్టపడలేదు.
ఆ నిర్ణయాన్ని వరుడు, అతని కుటుంబం కూడా ఆమె నిర్ణయానికి మద్దతు తెలిపాడు. దీనితో వరుడు తన బంధువులతో కలిసి పెళ్లికి ముందే సిల్చార్ వెళ్లాడు. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడ క్వారంటైన్ లో ఉండి పెళ్లి జరిపారు. కీర్తి అధికారిక బంగ్లాలో బుధవారం ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కేవలం కర్ణాటక సంగీతం వినిపిస్తుండగా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్ వీడియో యాప్ ద్వారా 800 మంది చూశారు. హైదరాబాద్లో ఉన్న మా అమ్మానాన్నలకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో నా సోదరి మాత్రమే పెళ్లికి హాజరైంది అని కీర్తి తెలిపారు. మంగళ, గురువారాల్లో కూడా కీర్తి అధికారిగా తన విధుల్లో పాల్గొన్నారు. ఇక పెళ్లి రోజైన బుధవారం కూడా ఫోన్ ద్వారా అధికారులకి తగిన సలహాలు ఇచ్చారు.
