Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక .. టఫ్ ఫైట్ ఖాయమే ?

By:  Tupaki Desk   |   24 Jun 2021 9:30 AM GMT
సెప్టెంబర్ లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక .. టఫ్ ఫైట్ ఖాయమే ?
X
తెలంగాణ లో మరోసారి ఎన్నికల నగారా మొగడానికి సమయం ఆసన్నం అయ్యింది. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ ఎస్ కి రాజీనామా చేసిన నేపథ్యంలో అయన నియోజకవర్గమైన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దీనితో అన్ని పార్టీలు కూడా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పై అప్పుడే ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా టీఆర్ ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ జరగనుంది. గెలుపే ధ్యేయంగా టీఆర్ ఎస్ పావులు కదుపుతుంటే , మరోవైపు హుజూరాబాద్‌ లో గెలిచి తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. అలాగే ఈటల రాజేందర్ కి స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉండటం తో గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే .. టీఆర్ ఎస్ నేతలు అక్కడ మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో మండల ఇంఛార్జ్‌ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్‌ రూరల్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జమ్మికుంట ఎంపీ అర్వింద్, జమ్మికుంట రూరల్ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి, కమలాపూర్- కూన శ్రీశైలం గౌడ్‌ లను ఇంఛార్జ్‌లుగా నియమించింది. నియోజకవర్గ కోఆర్డినేర్‌ గా గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిని ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సెప్టెంబర్ లో జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అన్ని పార్టీల నేతలకి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగా ముందుగా ఎన్నికల సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఆ నియోజకవర్గంలోని ఓటర్లకు ,నేతలకి భారీ స్థాయిలో వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు రచిస్తునట్టు తెలుస్తుంది.

ఇకపోతే ఈ ఎన్నికలు ఇప్పుడు అత్యంత ఖరీదు అని రాజకీయాలలో చర్చ సాగుతోంది. ఇటు టీఆరెస్ అటు ఈటెల రాజేందర్ వర్గం, పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆరెస్, ఇద్దరు మంత్రులు టీఆరెస్ పార్టీ రంగంలోకి దింపింది. మరోపక్క దుబ్బాక విజమామే స్ఫూర్తిగా తీసుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికలు రెడీ అవుతోంది. ఇపుడు బీజేపీ పార్టీకి ప్రధాన బలం ఈటెల ఆపార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు వెళ్లడమే, ఈటల ఇమేజ్ బీజేపీ కి విజయం అందిస్తుందని భావిస్తున్నారు.