Begin typing your search above and press return to search.

మద్యం మత్తు: నాలుగో పెళ్లాంతో మూడో పెళ్లాం ఇంటికి.. ఏమైందంటే?

By:  Tupaki Desk   |   28 May 2020 11:30 PM GMT
మద్యం మత్తు: నాలుగో పెళ్లాంతో మూడో పెళ్లాం ఇంటికి.. ఏమైందంటే?
X
పెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. మంట అని మగపుంగవులు వాపోతుంటారు. తాము బ్యాచ్ లర్ గా ఎంజాయ్ చేశామని.. పెళ్లి అయ్యాక బందీ అయిపోయామని బాధపడుతుంటారు. ఒక్క భార్యను మెయింటేన్ చేయడానికే తల ప్రాణం తోకకు వస్తుంటే.. ఏకంగా ఇతగాడు నలుగురు భార్యలను మెయింటేన్ చేసి వీరుడు అనిపించుకున్నాడు. కానీ వారిని మెయింటేన్ చేయడంలో చేసిన పొరపాటు అతడికే ఎసరు వచ్చింది.

ఇప్పటికే భార్యలతో వేగలేని వారు భార్య బాధిత సంఘాలుగా ఏర్పడి ఫైట్ చేస్తున్నారు. కానీ ఇతగాడు ఒక భార్య చనిపోగానే మరో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం చేస్తున్నాడు. ముగ్గురిని వేర్వేరు ఊళ్లలో ఉంచి మెయింటేన్ చేస్తున్నాడు. మద్యం మత్తులో అతడు చేసిన పొరపాటు చావుకు దారితీసింది.

మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలోని గొటెగావ్ తెహ్సిల్ ప్రాంతానికి చెందిన హేమ్ రాజ్ కు నలుగురు భార్యలు. మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత ముగ్గురు భార్యలతో మూడు చోట్ల కాపురం పెట్టాడు. రెండో భార్య నర్సింగ్ పూర్ లో.. మూడో భార్య బగాస్ పూర్ లో .. నాలుగో భార్య కరేలీలో ఉంచి వారితో ఎవరికి తెలియకుండా కాపురం చేస్తున్నాడు.

మందుబాబు అయిన హేమరాజ్ తనతో ఉన్నది మూడో భార్య అనే సంగతి మర్చిపోయి నాలుగో భార్య ఇంటికి తీసుకెళ్లాడు. అయితే భర్త ఎక్కడికి తీసుకెళ్తున్నాడోనని నాలుగో భార్య గమ్మున ఊరుకుంది. సవతితో ఇంటికొచ్చిన భర్తను చూసి మూడో భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తతో గొడవ పడింది. హేమ్ రాజ్ ఆమెను కొట్టాడు. భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లింది. తెల్లవారి ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి భర్త ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించాడు. తన నాలుగు పెళ్లాల విషయం ఇద్దరికీ తెలియడంతో అతడు భయపడి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.