Begin typing your search above and press return to search.
భార్యను చంపిన భర్తకు ఉరి శిక్ష !
By: Tupaki Desk | 8 April 2021 3:03 PM ISTభార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును విధించింది. కృష్ణలంక లో 2019లో గర్భవతి అయిన భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కోర్టు భర్త బత్తుల సంబియార్ సుజిత్ కు ఉరిశిక్షను విధించింది. కోర్టు ఈ తీర్పును ప్రకటించిన నేపథ్యంలో బాధితురాలి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే .. 2019 జూన్ 15న ఏపీ రాష్ట్రంలోని ఫకీర్గూడెంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.నిందితుడు సుజిత్ తన భార్యను చంపినట్టుగా కోర్టుకు ఆధారాలను పోలీసులు సమర్పించడంతో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సుజిత్ కు ఉరిశిక్షను విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసుల్లో గతంలో కూడ కోర్టులు మరణశిక్షలు విధించాయి. అయితే మరణశిక్షలు విధించడం చాలా అరుదుగా జరుగుతుందని న్యాయ నిపుణుులు అభిప్రాయపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే .. 2019 జూన్ 15న ఏపీ రాష్ట్రంలోని ఫకీర్గూడెంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.నిందితుడు సుజిత్ తన భార్యను చంపినట్టుగా కోర్టుకు ఆధారాలను పోలీసులు సమర్పించడంతో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సుజిత్ కు ఉరిశిక్షను విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసుల్లో గతంలో కూడ కోర్టులు మరణశిక్షలు విధించాయి. అయితే మరణశిక్షలు విధించడం చాలా అరుదుగా జరుగుతుందని న్యాయ నిపుణుులు అభిప్రాయపడుతున్నారు.
