Begin typing your search above and press return to search.

చంద్రుడి పైకి మనుషులు ...దానికోసమే నాసా ప్రయోగం

By:  Tupaki Desk   |   21 Sep 2021 9:17 AM GMT
చంద్రుడి పైకి మనుషులు ...దానికోసమే నాసా ప్రయోగం
X
నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి తీసుకు వెళ్లేందుకు అన్ని సిద్ధం చేస్తుంది. అయితే మనుషులను పంపడానికి ముందు నాసా, ప్రస్తుతం ఉన్న సాంకేతికతను పరిక్షీంచే పనిలో నిమగ్నమై ఉంది. అంతరిక్ష పదార్థాల శక్తిని పరీక్షించడానికి నాసా 40 అడుగల పొడవున్న ఎయిర్ గన్‏ ను సిద్దం చేసింది. బర్డ్ స్ట్రైక్స్ నుంచి బాలిస్టిక్ ఎఫెక్ట్స్ వరకు విమానాలను పరీక్షించడానికి ఎయిర్ గన్స్ ఉపయోగిస్తారు. అయితే వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తారు. అక్కడి నుంచి చంద్రునిపైకి వెళ్తారు. అందుకే ప్రతి చిన్న రాతి లేదా లోహపు కణాలు గంటకు 22 వేల మైళ్ల వేగంతో విశ్వంలో తిరుగుతుంటాయి.

అందుకే అక్కడకు మనుషులను పంపించడానికి ముందు అన్ని రకాల తనీఖీలు చేయడం చాలా ముఖ్యం. గ్లెన్ రీసెర్చ్ సెంటర్ యొక్క బాలిస్టిక్ ఇంపాక్ట్ ల్యాబ్ నుంచి కొందరు ఇంజనీర్లు భవిష్యత్తులో ఆర్టెమిస్ మిషన్ల కోసం స్థిరమైన మెటీరియల్స్ ఎంచుకున్నారని, అవి చంద్రుని ఉపరితలంపై ఎలా పనిచేస్తాయో నిర్ధారించడానికి పని చేస్తున్నాయి. అక్కడ ఇళ్లను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను బృందం అంచనా వేస్తోంది. ఇవి మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందిస్తున్నారు. వివిధ వస్త్రాల స్టీల్ బాల్ బేరింగ్‌లను కాల్చడానికి ఇంజనీర్లు ఎయిర్‌గన్‌లను ఉపయోగిస్తున్నారు.

శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ ఎయిర్ గన్‏ తో చెక్ చేస్తున్నారు. వ్యోమగాములు బయటి వాతావరణంలో పనిచేసినప్పుడు, వారిని సురక్షితంగా ఉంచడానికి సూట్ రెడీ చేయడానికి ఎలాంటి మెటీరియల్ సిద్ధం చేయాలనేదానిపై పరీశోధనలు నిర్వహిస్తున్నారు. అందుకు కావాల్సిన అసలైన మెటీరియల్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది వ్యోమగాముల శరీరంలోకి మైక్రోమీటర్ రాకుండా నిరోదించేలా చూసుకుంటారు.చంద్రుడి పై ఉండే వాతావరణంలో ఎయిర్‌గన్‌లు ఉపయోగిస్తున్నారు. అవి వేగంగా అక్కడ పనిచేస్తాయి. ఇక అదే సమయంలో సెన్సార్లు, హై-స్పీడ్ కెమెరాల ద్వారా ఏ పదార్థం ఎంత శక్తిని గ్రహిస్తుందో కొలుస్తారు. దీని ద్వారా ప్రతి మెటీరియల్ యొక్క బలం పరీక్షించబడుతుంది.

ఎయిర్‌గన్ ద్వారా పరీక్షించిన పదార్థాలు స్పేస్‌ సూట్‌ లను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల నుండి ఇతర వాహనాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల వరకు ఉన్నాయని నాసా తెలిపింది. వ్యోమగాముల భద్రతకు పదార్థంకు ఉంటే బలం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధృవంగా పిలచే పురాతన బిలం పైకి మంచు జాడను అన్వేషించే రోవర్‌ ను 2023 కల్లా ల్యాండింగ్‌ చేయనున్నట్లు నాసా సోమవారం ప్రకటించింది. ఈ పురాతన బిలం దక్షిణ ధృవం వద్ద రెండు భారీ ఖగోళ శకలాలు ఢీ కొనడంతో ఏర్పడిందని నాసా ప్లానేటరీ డివిజన్‌ డైరక్టర్‌ లోరీ గ్లేజ్‌ వెల్లడించారు.

సౌర వ్యవస్థలో ఇది అత్యంత శీతల ప్రాంతం కాబట్టి ఇక్కడ మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని అన్నారు. పైగా అక్కడ వాతవారణ పరిస్థితులు అస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇంతవరకు చంద్రుని కక్ష్యలో పరిభ్రమించే సెన్సర్‌ ఉపగ్రహం సాయంతో దూరం నుంచే పరిశోధనలు చేసినట్లు పేర్కొంది. ఇక పై చంద్రుని ఉపరితలంపై నేరుగా ఈ సరికొత్త టెక్కాలజీతో రూపొందించిన రోవర్‌ సాయంతో పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఈ రోవర్‌ చంద్రుని భూభాగంపై అనేక అడుగులు దిగువ వరకు రంధ్రలు చేసి మరింత సమగ్రంగా పరిశోధనలు చేస్తుందని, ఈ రోవర్‌ చంద్రుని ఉపరితలం పై మంచు నీరు జాడును నిర్థారించడమే కాక దీన్ని రాకెట్‌ ఇంధనంగా మార్చి అరుణ గ్రహంపై వెళ్లడానికి ఉపకరించే సమగ్ర సమన్వయ వ్యవస్థలా పనిచేయగలదని నాసా బావిస్తుందని అన్నారు. అరుణ గ్రహం భూమికి అతి చేరువలో రెండు లక్షల మైళ్లు లేదా 1.3 సెకన్ల కాంతి దూరంలో ఉందిని చెప్పారు. చార్జింగ్‌ కోసం సౌలార్‌ వ్యవస్థపై ఆధారపడుతుందని, పైగా సూర్యుడు ఎటువైపు ఉంటే అటూవైపుగా బ్యాటరీ ప్యానెల్‌ ని మార్చుకుంటుందని పేర్కొన్నారు. ఈ రోవర్‌ సాయంతో చంద్రుని ఉపరితలంపై ఏఏ ప్రాంతాల్లో మంచు నీరు లభిస్తోంది, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది ఎలా ఆవిరవుతోంది, ఎటు వెళ్లుతోంది, తదితర పరోశోధనలు చేస్తున్నట్లు వివరించారు.