Begin typing your search above and press return to search.
గవర్నర్ కి తప్పిన ఘోర ప్రమాదం !
By: Tupaki Desk | 14 Dec 2020 2:19 PM ISTహిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివార్లలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. అయితే, డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా ఆపగలిగాడు. ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు. సూర్యాపేటలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం జరుగనుంది. ఈ ప్రయాణానికి ముందు గవర్నర్ దత్తాత్రేయతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. అయితే, డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా ఆపగలిగాడు. ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు. సూర్యాపేటలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం జరుగనుంది. ఈ ప్రయాణానికి ముందు గవర్నర్ దత్తాత్రేయతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
