Begin typing your search above and press return to search.
రంగులు మార్చండి..ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం
By: Tupaki Desk | 20 April 2020 6:10 PM ISTపంచాయతీ ఆఫీసులకు వైసీపీ జెండా వేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ముందే పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు తొలగించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను 3 వారాల్లో పూర్తి చేయాలని తాజాగా గడువు ఇచ్చింది. ఏ పార్టీకి సంబంధం లేని రంగులు వేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదివరకే దీనిపై గతంలో విచారించిన హైకోర్టు ఏపీ సర్కారును ఆదేశించగా జగన్ ప్రభుత్వం గడువు కోరింది. మరికొంత సమయం కావాలని తాజాగా సర్కారు హైకోర్టులో అనుబంధ పిటీషన్ దాఖలు చేసింది.
దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు 3 నెలల గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను నిరాకరించింది. కేవలం 3 వారాల గడువును మాత్రమే ఇచ్చింది.
ఇదివరకే దీనిపై గతంలో విచారించిన హైకోర్టు ఏపీ సర్కారును ఆదేశించగా జగన్ ప్రభుత్వం గడువు కోరింది. మరికొంత సమయం కావాలని తాజాగా సర్కారు హైకోర్టులో అనుబంధ పిటీషన్ దాఖలు చేసింది.
దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు 3 నెలల గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను నిరాకరించింది. కేవలం 3 వారాల గడువును మాత్రమే ఇచ్చింది.
