Begin typing your search above and press return to search.
జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
By: Tupaki Desk | 6 Dec 2021 5:29 PM ISTఏపీలో ప్రస్తుతం సీఎంగా జగన్ ఉన్నారు. తీరిన లేని పనితో బిజీగా ఉంటారు. అటు పాలన, ఇటు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో 24 గంటలూ పనిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కేసుల విషయంలో మినహాయింపునివ్వాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దానిపై కోర్టు తాజాగా స్పందించింది.
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోరింది.
జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో హైకోర్టు నిరాకరించిందని సీబీఐ వాదించింది.
ఏపీలో సీఎంగా ఉన్న జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం సీబీఐ తన వాదనల్లో పేర్కొంది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటీషన్ల దశలోనే ఉన్నాయని తెలిపింది.
హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ కోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటీషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోరింది.
జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో హైకోర్టు నిరాకరించిందని సీబీఐ వాదించింది.
ఏపీలో సీఎంగా ఉన్న జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం సీబీఐ తన వాదనల్లో పేర్కొంది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటీషన్ల దశలోనే ఉన్నాయని తెలిపింది.
హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ కోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటీషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.
